పవన్ కళ్యాణ్ సినిమాలు లేటవుతుంటే ఆయన ఫ్యాన్స్ ఎంత అప్సెట్ అవుతున్నారో తెలియదు కాని, ఆయన సినిమాలను నమ్ముకున్న కొంతమంది సెలబ్రిటీలు మాత్రం బాగా అప్సెట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తానని కమిట్మెంట్ ఇచ్చేసిన జనసేనాని, చివరకు క్రిష్ సినిమా ఒక్కటే పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. పవన్ను మాత్రమే నమ్ముకున్న కొంతమంది హీరోలు డైరక్టర్లూ బాగా డిజప్పాయింట్ అయిపోయినట్లే.
సాహో సినిమాతో ఇండియావైడ్ పాపురల్ అయ్యాడు డైరక్టర్ సుజిత్ రెడ్డి. ఆల్రెడీ రన్ రాజా రన్ తరువాత వెంటనే సినిమా చేయకుండా.. ప్రభాస్ కోసం ఏకంగా కొన్ని సంవత్సరాలపాటు వెయిట్ చేశాడు. చివరకు చాలా స్టయిలిష్గా సాహో సినిమాను తీసినా కూడా.. ఆ సినిమా తేడపడటంతో సుజిత్ షాక్ అయ్యాడు. కాని వెంటనే మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆనందపడ్డాడు. బట్ చివర్లో తమిళ డైరక్టర్ మోహన్ రాజాను ఈ రీమేక్ కోసం ఎంచుకుని మెగాస్టార్ సుజిత్కు పెద్ద షాకే ఇచ్చారు.
ఆ తరువాత మనోడు పూర్తి టాలెంట్ వాడేసి పవన్ కళ్యాన్ను ఇంప్రెస్ చేస్తే.. ఇప్పుడేమో సినిమా 2024 వరకు టేకాఫ్ అవ్వదని క్లారిటీ వచ్చేసరికి ఇంకా షాకైపోతున్నాడట. మరి వేరే హీరోతే ఏదైనా సినిమా చేస్తాడా లేదంటే ప్రభాస్ కోసం ఎదురు చూసినట్లు పవన్ కళ్యాణ్ కోసం కూడా వెయిట్ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ అలా వెయిట్ చేస్తే మాత్రం.. స్టార్ హీరోల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే డైరక్టర్గా చరిత్రకెక్కుతాడు ఈ కుర్ర డైరక్టర్.
ఇకపోతే తనకు యాక్సిడెంట్ అయిన తరువాత ఎటువంటి సినిమాతో ముందుకొస్తే బాగుంటుందోనని మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలానే కష్టపడ్డాడు. చివరకు ఓ రెండు సినిమాలు ఓకె అయినా కూడా.. పవన్ కళ్యాణ్తో కలసి చేసే వినోదాయసితం రీమేక్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. సితార సంస్థ మరియు త్రివిక్రమ్ వైఫ్ ప్రొడ్యూస్ చేయాల్సిన ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇచ్చేలా లేడని టాక్ నడుస్తుండగా.. ఈ సినిమాను 2024లో టేకాఫ్ చేద్దామని పవన్ చెప్పడంతో మేనల్లుడు తేజు కూడా బాగా హర్ట్ అయిపోయాడట.
This post was last modified on November 15, 2022 12:06 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…