ఓటిటిల మధ్య పోటీ ఎక్కువైపోయి ఎలాంటి కంటెంట్ తో ఆడియన్స్ ని నిలబెట్టుకోగలమో ఆలోచిస్తూ దానికి ఏమేం చేయాలో, ఎంత క్రియేటివ్ గా ఆలోచించాలో సదరు డిజిటల్ కంపెనీలు అన్నీ చేస్తున్నాయి. తక్కువ గ్యాప్ లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. డాక్యుమెంటరీలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీస్తున్నాయి. స్పోర్ట్స్ ఫ్యాన్స్ ని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఐసిసితో టై అప్ చేసుకుని క్రికెట్ మ్యాచులను లైవ్ ఇస్తున్నాయి. టాక్ షోలు, ఇంటర్వ్యూలు, డాన్స్ ప్రోగ్రాంలు, వంటలు ఒకటా రెండా అన్నీ చేస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీ వెడ్డింగ్స్ ని లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహ వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి హక్కులు కొనుగోలు చేసిందన్న వార్త ఓ సెన్సేషన్ గా నిలవడం అందరికీ గుర్తే. అదింకా రిలీజ్ చేయలేదు కానీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ముందే సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అగ్రిమెంట్ ఉల్లంఘించారనే దాని మీదే ఏదో వివాదం నడుస్తోందన్నారు కానీ అది నిజమో కాదో కన్ఫర్మేషన్ లేదు. ఆ వీడియోని డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ కూడా వివరాలు చెప్పలేదు. ఇప్పుడు ఈ లిస్టులో హన్సిక మొత్వానిని చేర్చబోతున్నారు
హన్సిక త్వరలో స్నేహితురాలి మాజీ భర్త, తన ప్రియుడు సోహైల్ కతూరియాతో మూడు ముళ్ళు వేయించుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3, 4 తేదీల్లో జరగబోయే ఈ పెళ్లిని ఓ ప్రముఖ ఓటిటి భారీ రేట్ ఇచ్చి రైట్స్ కొనుక్కుందట. హన్సికకు అంత క్రేజ్ ఉందా అనుకోకోకండి. ఒకదశలో ఆమెకు తమిళనాడులో గుడి కట్టే రేంజ్ లో అభిమానులున్నారు. అందుకే ఖచ్చితంగా వ్యూస్ భారీగా వస్తాయనే ఉద్దేశంతో ఇలా సెట్ చేశారన్న మాట. ఇంకా అఫీషియల్ అయితే కాలేదు. ఇంకా పెళ్లి కాని, చేసుకోబోయే టాప్ హీరోయిన్లు బోలెడున్నారు. ఇలా అందరూ ఇదే దారి పడితే ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు
This post was last modified on November 14, 2022 9:16 pm
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…