ఓటిటిల మధ్య పోటీ ఎక్కువైపోయి ఎలాంటి కంటెంట్ తో ఆడియన్స్ ని నిలబెట్టుకోగలమో ఆలోచిస్తూ దానికి ఏమేం చేయాలో, ఎంత క్రియేటివ్ గా ఆలోచించాలో సదరు డిజిటల్ కంపెనీలు అన్నీ చేస్తున్నాయి. తక్కువ గ్యాప్ లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. డాక్యుమెంటరీలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీస్తున్నాయి. స్పోర్ట్స్ ఫ్యాన్స్ ని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఐసిసితో టై అప్ చేసుకుని క్రికెట్ మ్యాచులను లైవ్ ఇస్తున్నాయి. టాక్ షోలు, ఇంటర్వ్యూలు, డాన్స్ ప్రోగ్రాంలు, వంటలు ఒకటా రెండా అన్నీ చేస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీ వెడ్డింగ్స్ ని లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహ వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి హక్కులు కొనుగోలు చేసిందన్న వార్త ఓ సెన్సేషన్ గా నిలవడం అందరికీ గుర్తే. అదింకా రిలీజ్ చేయలేదు కానీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ముందే సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అగ్రిమెంట్ ఉల్లంఘించారనే దాని మీదే ఏదో వివాదం నడుస్తోందన్నారు కానీ అది నిజమో కాదో కన్ఫర్మేషన్ లేదు. ఆ వీడియోని డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ కూడా వివరాలు చెప్పలేదు. ఇప్పుడు ఈ లిస్టులో హన్సిక మొత్వానిని చేర్చబోతున్నారు
హన్సిక త్వరలో స్నేహితురాలి మాజీ భర్త, తన ప్రియుడు సోహైల్ కతూరియాతో మూడు ముళ్ళు వేయించుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3, 4 తేదీల్లో జరగబోయే ఈ పెళ్లిని ఓ ప్రముఖ ఓటిటి భారీ రేట్ ఇచ్చి రైట్స్ కొనుక్కుందట. హన్సికకు అంత క్రేజ్ ఉందా అనుకోకోకండి. ఒకదశలో ఆమెకు తమిళనాడులో గుడి కట్టే రేంజ్ లో అభిమానులున్నారు. అందుకే ఖచ్చితంగా వ్యూస్ భారీగా వస్తాయనే ఉద్దేశంతో ఇలా సెట్ చేశారన్న మాట. ఇంకా అఫీషియల్ అయితే కాలేదు. ఇంకా పెళ్లి కాని, చేసుకోబోయే టాప్ హీరోయిన్లు బోలెడున్నారు. ఇలా అందరూ ఇదే దారి పడితే ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు
This post was last modified on November 14, 2022 9:16 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…