ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాక ఇండియన్ సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రాల్లో రామ్ చరణ్-శంకర్ కలయికలో (RC 15) తెరకెక్కుతున్న సినిమా ఒకటి. శంకర్కు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫాలోయింగ్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా ఈ సినిమాను చరణ్ పట్టాలెక్కించాడు కానీ.. కొన్ని అడ్డంకులు తప్పట్లేదు.
ఒక దశ వరకు షూటింగ్ జోరుగా సాగినప్పటికీ.. మధ్యలో ‘ఇండియన్-2’ తెరపైకి రావడంతో చరణ్ అటు వైపు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ ప్రధానంగా ఆ చిత్రం మీదే ఉంది. మధ్య మధ్యలో చరణ్ సినిమాకు డేట్లు ఇస్తున్నా.. ప్రయారిటీ అయితే ‘ఇండియన్-2’ను త్వరగా పూర్తి చేయడం లాగే ఉంది. దీంతో ఆల్రెడీ చరణ్ సినిమాను 2023 సంక్రాంతి రేసు నుంచి తప్పించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2023 వేసవిలోనూ రిలీజయ్యే అవకాశాలు లేనట్లే. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా 100 రోజుల దాకా జరపాల్సి ఉందట. వంద రోజులకు టీంలో అందరూ డేట్లు కేటాయించాలంటే కనీసం ఇంకో ఏడాది అయినా పడుతుంది. కాబట్టి వచ్చే ఏడాది రెండో అర్ధంలోనే సినిమా పూర్తయ్యే అవకాశముంది.
ఇది పాన్ ఇండియా సినిమా కావడం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలానే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్కు చాలానే టైం పడుతుంది. కాబట్టి 2023లో సినిమా రిలీజవడం కష్టమే అని చెప్పొచ్చు. కుదిరితే ఆ ఏడాది చివర్లో రిలీజ్ చేయొచ్చు. లేదంటే 2024 సంక్రాంతికి వెళ్లొచ్చు. కాగా త్వరలోనే చరణ్-కియారా అద్వానీల మీద ఒక భారీ పాట చిత్రీకరణ కోసం టీం న్యూజిలాండ్కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే.
This post was last modified on November 13, 2022 10:15 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…