ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాక ఇండియన్ సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రాల్లో రామ్ చరణ్-శంకర్ కలయికలో (RC 15) తెరకెక్కుతున్న సినిమా ఒకటి. శంకర్కు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫాలోయింగ్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా ఈ సినిమాను చరణ్ పట్టాలెక్కించాడు కానీ.. కొన్ని అడ్డంకులు తప్పట్లేదు.
ఒక దశ వరకు షూటింగ్ జోరుగా సాగినప్పటికీ.. మధ్యలో ‘ఇండియన్-2’ తెరపైకి రావడంతో చరణ్ అటు వైపు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ ప్రధానంగా ఆ చిత్రం మీదే ఉంది. మధ్య మధ్యలో చరణ్ సినిమాకు డేట్లు ఇస్తున్నా.. ప్రయారిటీ అయితే ‘ఇండియన్-2’ను త్వరగా పూర్తి చేయడం లాగే ఉంది. దీంతో ఆల్రెడీ చరణ్ సినిమాను 2023 సంక్రాంతి రేసు నుంచి తప్పించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2023 వేసవిలోనూ రిలీజయ్యే అవకాశాలు లేనట్లే. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా 100 రోజుల దాకా జరపాల్సి ఉందట. వంద రోజులకు టీంలో అందరూ డేట్లు కేటాయించాలంటే కనీసం ఇంకో ఏడాది అయినా పడుతుంది. కాబట్టి వచ్చే ఏడాది రెండో అర్ధంలోనే సినిమా పూర్తయ్యే అవకాశముంది.
ఇది పాన్ ఇండియా సినిమా కావడం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలానే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్కు చాలానే టైం పడుతుంది. కాబట్టి 2023లో సినిమా రిలీజవడం కష్టమే అని చెప్పొచ్చు. కుదిరితే ఆ ఏడాది చివర్లో రిలీజ్ చేయొచ్చు. లేదంటే 2024 సంక్రాంతికి వెళ్లొచ్చు. కాగా త్వరలోనే చరణ్-కియారా అద్వానీల మీద ఒక భారీ పాట చిత్రీకరణ కోసం టీం న్యూజిలాండ్కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…