కాలం చాలా విలువైంది, ఒక్కసారి పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ వెనక్కు తెచ్చుకోలేమనేది పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నదే. అందరికీ తెలిసిందే. కానీ కొత్త తరం దర్శకులు మాత్రం దాన్ని ఎంత మాత్రం వంటబట్టించుకోవడం లేదు. స్టార్ల ట్రాప్ లో పడి వాళ్ళతో సినిమాలు తీస్తేనే కెరీర్ పరుగులు పెడుతుందనే నమ్మకంతో బంగారం లాంటి సమయాన్ని కర్పూరంలా కరిగించేస్తున్నారు. ఉప్పెన వచ్చి రెండేళ్లు దాటుతోంది.
ఇంకో మూడు నెలలు ఆగితే సెకండ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ దర్శకుడు బుచ్చిబాబు కొత్త మూవీ మాత్రం ఇప్పటిదాకా మొదలుకాదు కదా కనీసం ఫైనల్ కాలేదు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ దాని తర్వాత రెండు రిలీజ్ చేసుకుని మరో రెండు సెట్ల మీద ఉంచాడు. కృతి శెట్టి ఏకంగా అయిదారు ఫినిష్ చేసి ఇంకో రెండు షూటింగులలో బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎన్ని చేసిందో వెంటనే లెక్క చెప్పడం కష్టం.
ఎటు తిరిగి బుచ్చిబాబునే ఇంకా మీమాంసలో కొనసాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పెద్ది టైటిల్ తో ఏదో ప్రాజెక్టు ఉందనే ప్రచారం జరిగింది. ఇంకా కొరటాల శివదే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇదెంత వరకు కన్ఫర్మ్ అవుతుందో చెప్పలేం. మరోవైపు చరణ్ కు స్టోరీ చెప్పాడనే ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతోంది.
అప్పుడప్పుడు గురు సుకుమార్ తో ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్న ఫోటోలు అడపాదడపా ట్విట్టర్ స్పేస్ లో ఫ్యాన్స్ తో కలిసి చేస్తున్న చర్చలు మినహాయించి బుచ్చిబాబు నుంచి ఒక స్థిరమైన అడుగు ఏదీ పడలేదు. పోనీ తనైనా ఫలానా హీరోతో చేస్తున్నాననో లేదా లైన్ మీద వర్క్ జరుగుతోందనో చెబితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తన వైపు నుంచి నో అప్ డేట్. బుచ్చిబాబు లాంటి యంగ్ టాలెంట్స్ రెండో సినిమాకే ఇంత టైంని ఖర్చుపెడితే ఇక కెరీర్ వేగంగా సాగేదెలా .ఒకప్పుడు దాసరి, కోడి రామకృష్ణ లాంటి అగ్ర దర్శకులు వందల సినిమాలు ఎలా చేశారో కానీ ఇప్పటి డైరెక్టర్లు మాత్రం పది చేస్తేనే గొప్పేమో
This post was last modified on November 13, 2022 6:21 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…