కాలం చాలా విలువైంది, ఒక్కసారి పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ వెనక్కు తెచ్చుకోలేమనేది పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నదే. అందరికీ తెలిసిందే. కానీ కొత్త తరం దర్శకులు మాత్రం దాన్ని ఎంత మాత్రం వంటబట్టించుకోవడం లేదు. స్టార్ల ట్రాప్ లో పడి వాళ్ళతో సినిమాలు తీస్తేనే కెరీర్ పరుగులు పెడుతుందనే నమ్మకంతో బంగారం లాంటి సమయాన్ని కర్పూరంలా కరిగించేస్తున్నారు. ఉప్పెన వచ్చి రెండేళ్లు దాటుతోంది.
ఇంకో మూడు నెలలు ఆగితే సెకండ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ దర్శకుడు బుచ్చిబాబు కొత్త మూవీ మాత్రం ఇప్పటిదాకా మొదలుకాదు కదా కనీసం ఫైనల్ కాలేదు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ దాని తర్వాత రెండు రిలీజ్ చేసుకుని మరో రెండు సెట్ల మీద ఉంచాడు. కృతి శెట్టి ఏకంగా అయిదారు ఫినిష్ చేసి ఇంకో రెండు షూటింగులలో బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎన్ని చేసిందో వెంటనే లెక్క చెప్పడం కష్టం.
ఎటు తిరిగి బుచ్చిబాబునే ఇంకా మీమాంసలో కొనసాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పెద్ది టైటిల్ తో ఏదో ప్రాజెక్టు ఉందనే ప్రచారం జరిగింది. ఇంకా కొరటాల శివదే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇదెంత వరకు కన్ఫర్మ్ అవుతుందో చెప్పలేం. మరోవైపు చరణ్ కు స్టోరీ చెప్పాడనే ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతోంది.
అప్పుడప్పుడు గురు సుకుమార్ తో ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్న ఫోటోలు అడపాదడపా ట్విట్టర్ స్పేస్ లో ఫ్యాన్స్ తో కలిసి చేస్తున్న చర్చలు మినహాయించి బుచ్చిబాబు నుంచి ఒక స్థిరమైన అడుగు ఏదీ పడలేదు. పోనీ తనైనా ఫలానా హీరోతో చేస్తున్నాననో లేదా లైన్ మీద వర్క్ జరుగుతోందనో చెబితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తన వైపు నుంచి నో అప్ డేట్. బుచ్చిబాబు లాంటి యంగ్ టాలెంట్స్ రెండో సినిమాకే ఇంత టైంని ఖర్చుపెడితే ఇక కెరీర్ వేగంగా సాగేదెలా .ఒకప్పుడు దాసరి, కోడి రామకృష్ణ లాంటి అగ్ర దర్శకులు వందల సినిమాలు ఎలా చేశారో కానీ ఇప్పటి డైరెక్టర్లు మాత్రం పది చేస్తేనే గొప్పేమో
This post was last modified on November 13, 2022 6:21 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…