అను ఇమ్మాన్యుయెల్.. ఒక టైంలో టాలీవుడ్లో చాలా గట్టిగా వినిపించిన పేరు ఇది. చిన్న సినిమాలతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అల్లు అర్జున్తో ‘నా పేరు సూర్య’, పవన్ కళ్యాణ్తో ‘అజ్ఞాతవాసి’ లాంటి భారీ చిత్రాల్లో నటించడంతో ఆమె పేరు మార్మోగింది. కానీ ఆ పెద్ద సినిమాలు పెద్ద డిజాస్టర్లవడంతో ఆమె చూస్తుండగానే కనుమరుగైపోయింది. చివరగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించిన మాయం అయిన అను.. చాన్నాళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో మళ్లీ మన ప్రేక్షకుల దృష్టిలో పడింది.
కొంచెం బోల్డ్ టచ్ ఉన్నప్పటికీ ధైర్యం చేసి ఈ పాత్రలో నటించడం ఆమెకు కలిసి వచ్చింది. సినిమా మంచి టాకే తెచ్చుకుంది. ఓ మోస్తరు వసూళ్లతో ముందుకు సాగుతోంది.
అను కెరీర్కు ‘ఊర్వశివో రాక్షసివో’ ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకు ఆమే ప్రధాన ఆకర్షణ. లిప్ లాక్స్, బోల్డ్ యాక్ట్స్తో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన అనుకు మళ్లీ టాలీవుడ్లో ఆఫర్లు రావచ్చు. ఐతే అంతకంటే ముందు తమిళంలో ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసింది అను. అక్కడ స్టార్ హీరోల్లో ఒకడైన కార్తితో ఆమె జట్టు కడుతోంది. అతను హీరోగా ‘జపాన్’ అనే సినిమా మొదలైంది.
ఇంతకుముందు ‘జోకర్’ అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన రాజు మురుగన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘జపాన్’ అనే వెరైటీ టైటిల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తక్కువ గ్యాప్లో ‘పొన్నియన్ సెల్వన్’, ‘సర్దార్’ లాంటి పెద్ద హిట్లు కొట్టిన కార్తి సరసన కథానాయికగా అంటే అనుకు పెద్ద ఛాన్స్ అన్నట్లే. దీంతో పాటు తెలుగులోనూ రెండు మూడు పడ్డాయంటే మళ్లీ ఆమె కెరీర్ ఊపందుకున్నట్లే.
This post was last modified on November 9, 2022 10:22 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…