అను ఇమ్మాన్యుయెల్.. ఒక టైంలో టాలీవుడ్లో చాలా గట్టిగా వినిపించిన పేరు ఇది. చిన్న సినిమాలతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అల్లు అర్జున్తో ‘నా పేరు సూర్య’, పవన్ కళ్యాణ్తో ‘అజ్ఞాతవాసి’ లాంటి భారీ చిత్రాల్లో నటించడంతో ఆమె పేరు మార్మోగింది. కానీ ఆ పెద్ద సినిమాలు పెద్ద డిజాస్టర్లవడంతో ఆమె చూస్తుండగానే కనుమరుగైపోయింది. చివరగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించిన మాయం అయిన అను.. చాన్నాళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో మళ్లీ మన ప్రేక్షకుల దృష్టిలో పడింది.
కొంచెం బోల్డ్ టచ్ ఉన్నప్పటికీ ధైర్యం చేసి ఈ పాత్రలో నటించడం ఆమెకు కలిసి వచ్చింది. సినిమా మంచి టాకే తెచ్చుకుంది. ఓ మోస్తరు వసూళ్లతో ముందుకు సాగుతోంది.
అను కెరీర్కు ‘ఊర్వశివో రాక్షసివో’ ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకు ఆమే ప్రధాన ఆకర్షణ. లిప్ లాక్స్, బోల్డ్ యాక్ట్స్తో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన అనుకు మళ్లీ టాలీవుడ్లో ఆఫర్లు రావచ్చు. ఐతే అంతకంటే ముందు తమిళంలో ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసింది అను. అక్కడ స్టార్ హీరోల్లో ఒకడైన కార్తితో ఆమె జట్టు కడుతోంది. అతను హీరోగా ‘జపాన్’ అనే సినిమా మొదలైంది.
ఇంతకుముందు ‘జోకర్’ అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన రాజు మురుగన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘జపాన్’ అనే వెరైటీ టైటిల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తక్కువ గ్యాప్లో ‘పొన్నియన్ సెల్వన్’, ‘సర్దార్’ లాంటి పెద్ద హిట్లు కొట్టిన కార్తి సరసన కథానాయికగా అంటే అనుకు పెద్ద ఛాన్స్ అన్నట్లే. దీంతో పాటు తెలుగులోనూ రెండు మూడు పడ్డాయంటే మళ్లీ ఆమె కెరీర్ ఊపందుకున్నట్లే.
This post was last modified on November 9, 2022 10:22 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…