నాయగన్.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరున్న క్లాసిక్. మణిరత్నం అనే దర్శకుడి స్థాయి ఏంటో భారతీయ చిత్ర పరిశ్రమకు తెలియజేసిన సినిమా ఇది. ఇక నటుడిగా కమల్ హాసన్ కీర్తి కిరీటంలో దీన్నొక కలికుతురాయిగా చెప్పొచ్చు. తన కెరీర్ ఆరంభంలోనే కమల్ లాంటి దిగ్గజ నటుడితో అద్భుతమైన సినిమా తీసి గొప్ప ప్రశంసలు అందుకున్నాడు మణిరత్నం.
ఐతే ఇలాంటి క్లాసిక్ తీసిన కాంబినేషన్ నుంచి మళ్లీ సినిమానే రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక కెరీర్లో ఈ దశలో ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అందరికీ పెద్ద షాకిస్తూ 35 ఏళ్ల విరామం తర్వాత కమల్, మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారు. దీని గురించి ఆదివారమే సడన్ సర్ప్రైజ్ లాగా అనౌన్స్మెంట్ ఇచ్చారు.
విక్రమ్ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చిన కమల్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే నటించబోతున్నాడు లోకనాయకుడు. కమల్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును కమల్, మణిరత్నం కలిసి నిర్మించబోతుండడం విశేషం.
తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ సంస్త రెడ్ జెయింట్స్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి కాబోతోంది. వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమానే ఈ చిత్రానికి మ్యూజిక్ చేయబోతున్నాడు. పొన్నియన్ సెల్వన్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథుల్లో ఒకడిగా హాజరైన కమల్.. మణిరత్నం గురించి గొప్పగా మాట్లాడినపుడే మళ్లీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా అన్న చర్చ నడిచింది. ఇప్పుడు ఆ సందేహాలే నిజమయ్యాయి. మరి నాయకన్ జోడీ ఈసారి ఎలాంటి చిత్రాన్ని అందిస్తుందో?
This post was last modified on November 7, 2022 10:45 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…