మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తల్లి మరణం తర్వాత ఆ విషాదం నుంచి బయట పడేందుకు విదేశాలకు వెళ్లిన మహేష్ ఇటీవలే తిరిగి వచ్చేశాడు. కొత్త షెడ్యూల్ వివరాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ లోగా స్క్రిప్ట్ విషయంలో హీరోకి దర్శకుడికి పూర్తి ఏకాభిప్రాయం రాలేదనే వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినా అందులోనూ సరైన క్లారిటీ లేకపోయింది. మొత్తానికి వెయిటింగ్ అయితే తప్పదు.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విడుదల తేదీ గతంలోనే ఫిక్స్ చేశారు. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని అఫీషియల్ గా చెప్పారు. కానీ ఇప్పుడది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. నవంబర్ లేదా డిసెంబర్ కి షిఫ్ట్ కాక తప్పదని ఒకవేళ అదీ వద్దనుకుంటే హ్యాపీగా 2024 సంక్రాంతికి షిఫ్ట్ అయినా ఆశ్చర్యం లేదని ఘట్టమనేని వర్గాల నుంచి వస్తున్న లీక్. సమ్మర్ లో మంచి డేట్ అది కూడా పోకిరి, అడవిరాముడు, బాహుబలి 2 లాంటి వాటికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన స్లాట్. దాన్ని మిస్ చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీలవుతారు.
ఈలోగా పీఎస్ 2 సూపర్ స్టార్ డేట్ ని తీసేసుకుందని చెన్నై అప్ డేట్. ఏప్రిల్ 28 పొన్నియన్ సెల్వన్ రెండో భాగం రావడం కన్ఫర్మ్ అయినట్టే. ఈమేరకు ఇవాళో రేపో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తారు. తమిళంలో నాలుగు వందల కోట్లు రాబట్టిన ఈ పీరియాడిక్ డ్రామా ఇతర భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోయింది. అయితే అసలు కథ పీఎస్ 2లోనే ఉంటుందని, ఫస్ట్ పార్ట్ తో సంతృప్తి చెందని వాళ్ళను థ్రిల్ చేస్తుందని మణిరత్నం టీమ్ అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ కు ఒక మంచి సీజన్ మిస్ అయినట్టే. పీఎస్ 2 షూటింగ్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి వాళ్లకు టెన్షన్ లేదు.
This post was last modified on November 5, 2022 4:03 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…