‘కాంతార’ అనేది కన్నడ సినిమా. అది కర్ణాటకలోని ఒక ప్రాంతానికి సంబంధించిన ఆచార సంప్రదాయాల చుట్టూ తిరిగే సినిమా. నేటివిటీ ఫ్యాక్టర్ అందులో కీలకం. ఇక ఈ చిత్ర హీరో కమ్ ప్రొడ్యూసర్ రిషబ్ శెట్టి గురించి మన వాళ్లకు ఏమీ తెలియదు. ఇక ఈ చిత్రానికి తెలుగులో పెద్దగా ప్రమోషన్ కూడా ఏమీ చేయలేదు.
కేవలం మౌత్ టాక్, రివ్యూలు పాజిటివ్గా ఉండడం.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరగడంతో మన ప్రేక్ష్ఖకుల్లో ఆసక్తి కలిగింది. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆల్రెడీ ఈ చిత్రానికి తెలుగులో మాత్రమే రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ‘కాంతార’ రూ.300 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసింది. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ మీద నిర్మాతలేమీ ఆశలు వదులకున్నట్లుగా లేరు.
కన్నడలో ఐదో వారంలో, తెలుగు, హిందీ భాషల్లో మూడో వారంలోనూ సినిమా మంచి వసూళ్లు రాబడుతుండడంతో.. ఇప్పుడు ప్రమోషన్ జోరు పెంచుతున్నారు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి వివిద రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు చేస్తూ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో అతడికి అదిరిపోయే ప్రమోషనల్ సపోర్ట్ దొరికింది. దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్, భారతీయులకు కూడా ఎంతో ఇష్టమైన ఏబీ డివిలియర్స్.. ‘కాంతార’ సినిమాను ప్రమోట్ చేయడం విశేషం.
మిస్టర్ 360గా పేరున్న ఏబీకి బెంగళూరు కేంద్రంగా ఆడే రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో, కన్నడిగులతో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గత సీజన్కు ముందే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ.. తర్వాతి సీజన్కు ఆర్సీబీ సపోర్ట్ స్టాప్లో భాగం కాబోతున్నాడు. ఇందుకోసం బెంగళూరుకు వచ్చిన ఏబీ.. రిషబ్తో కలిసి ‘కాంతార’ సినిమాకు ఎలివేషన్ ఇచ్చాడు. కాంతార సినిమాను తప్పక చూడండని చెప్పడంతో పాటు ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన సౌండ్ను రిషబ్తో కలిసి రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలా ఒక లెజెండరీ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఒక ప్రాంతీయ సినిమాను ప్రమోట్ చేయడం గొప్ప విషయం. ‘కాంతార’ రీచ్ దీని వల్ల మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 4, 2022 8:50 am
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…