Political News

క‌డ‌ప‌లో ప‌రిస్థితి మారేలా ఉందే జగన్ అన్నా

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు మారేలా ఉన్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాను రెండుగా విభ‌జిస్తూ.. చేసిన నిర్ణ‌యం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేద‌నే విష‌యం తెలిసిందే. రాజంపేట కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే, రాయ‌చోటి కేంద్రంగానే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌ట్లో దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. కానీ, ప్ర‌భుత్వం మాత్రం తాను చేసిన నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డింది. ఇప్పుడు ఆవేడి ఇంకా కొనసాగుతూనే ఉంద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి క‌డ‌ప‌లోని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 చోట్ల వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

వీటిలో రాయ‌చోటి, రాజంపేట‌, క‌డ‌ప‌, బ‌ద్వేలు, రైల్వేకోడూరుల్లో వైసీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్వాలేద‌నే టాక్ ఉన్నా.. ఈ ఐదు నియోజ‌న‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. సీఎం జ‌గ‌న్ అయిన‌ప్ప‌టికీ.. జిల్లాకు ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం లేద‌నేది ఇక్క‌డి ప్ర‌జ‌ల టాక్. అదేస‌మ‌యంలో బ‌స్టాండు వివాదాల్లో ఉండ‌డం కూడా ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇక‌, ఉక్కు క‌ర్మాగానికి సీఎం జ‌గ‌న్ శంకు స్థాప‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు అడుగులు ముందుకు ప‌డ‌డంలేదు. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పులివెందుల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.

మ‌రోవైపు.. వైసీపీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం, కీల‌క‌మైన నాయ‌కులు శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు వంటివారికి ప్రాధాన్యం లేకుండా చేశార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మంత్రి వ‌ర్గంలో ప‌ద‌వులు ఈ ఇద్ద‌రూ ఆశించారు. అయితే, జ‌గ‌న్ వారికి ఇవ్వ‌క‌పోగా, ఉన్న చీఫ్ విప్‌ప‌ద‌విని కూడా శ్రీకాంత్‌రెడ్డి నుంచి తీసేశారు. ఇది అంత‌ర్గ‌తంగా నాయ‌కుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు దారితీసింది. పైకి అంతా బాగున్న‌ట్టుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికీ ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌డం లేదు. మేడా మ‌ల్లికార్జున రెడ్డి ప‌క్క చూపులు చూస్తున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజంపేట‌లో ఈ సారి వైసీపీ గెలిచే ప‌రిస్థితి లేద‌నిఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

ఇదిలావుంటే, జ‌న‌సేన కూడా క‌డ‌ప‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెంచింది. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ ఒక‌సారి ఇక్క‌డ ప‌ర్య‌టించారు. స్థానికంగా యువ‌త‌ను చీల్చి వైసీపీకి దెబ్బ‌కొట్టే కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న త‌న వ్యూహాల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు బీజేపీ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్ వంటివారు అంత‌ర్గ‌తంగా వైసీపీ నేత‌ల‌కు ట‌చ్‌లోకి వ‌స్తున్నారనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎలా చూసుకున్నా ఈ సారి వైసీపీకి ఇక్క‌డ అనుకున్నంత ఈజీ అయితే కాద‌నేది వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌రిగే అల‌వాటు ఉంది. సో.. ఇప్పుడు వైసీపీకి ఆ దెబ్బ త‌గిలినా ఆశ్చ‌ర్యం లేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి దీనిని జ‌గ‌న్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

This post was last modified on November 4, 2022 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

1 hour ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

2 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

2 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

2 hours ago

హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…

5 hours ago

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

10 hours ago