వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ పరిస్థితులు మారేలా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాను రెండుగా విభజిస్తూ.. చేసిన నిర్ణయం ఇక్కడి ప్రజలకు నచ్చలేదనే విషయం తెలిసిందే. రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, రాయచోటి కేంద్రంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కానీ, ప్రభుత్వం మాత్రం తాను చేసిన నిర్ణయానికే కట్టుబడింది. ఇప్పుడు ఆవేడి ఇంకా కొనసాగుతూనే ఉందని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి కడపలోని 10 నియోజకవర్గాల్లో 5 చోట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
వీటిలో రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు, రైల్వేకోడూరుల్లో వైసీపీ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో పర్వాలేదనే టాక్ ఉన్నా.. ఈ ఐదు నియోజనకవర్గాల్లో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ అయినప్పటికీ.. జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం లేదనేది ఇక్కడి ప్రజల టాక్. అదేసమయంలో బస్టాండు వివాదాల్లో ఉండడం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇక, ఉక్కు కర్మాగానికి సీఎం జగన్ శంకు స్థాపన చేసినా.. ఇప్పటి వరకు అడుగులు ముందుకు పడడంలేదు. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పులివెందులను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.
మరోవైపు.. వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, కీలకమైన నాయకులు శ్రీకాంత్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు వంటివారికి ప్రాధాన్యం లేకుండా చేశారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మంత్రి వర్గంలో పదవులు ఈ ఇద్దరూ ఆశించారు. అయితే, జగన్ వారికి ఇవ్వకపోగా, ఉన్న చీఫ్ విప్పదవిని కూడా శ్రీకాంత్రెడ్డి నుంచి తీసేశారు. ఇది అంతర్గతంగా నాయకుల మధ్య మనస్పర్థలకు దారితీసింది. పైకి అంతా బాగున్నట్టుగా ఉన్నప్పటికీ.. ఎవరికీ ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. మేడా మల్లికార్జున రెడ్డి పక్క చూపులు చూస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజంపేటలో ఈ సారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదనిఒక నిర్ణయానికి వచ్చేశారు.
ఇదిలావుంటే, జనసేన కూడా కడపపై ప్రత్యేక ఫోకస్ పెంచింది. ఇటీవల కాలంలో పవన్ ఒకసారి ఇక్కడ పర్యటించారు. స్థానికంగా యువతను చీల్చి వైసీపీకి దెబ్బకొట్టే కార్యక్రమాలకు ఆయన తన వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటివారు అంతర్గతంగా వైసీపీ నేతలకు టచ్లోకి వస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎలా చూసుకున్నా ఈ సారి వైసీపీకి ఇక్కడ అనుకున్నంత ఈజీ అయితే కాదనేది వాస్తవమేనని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అలవాటు ఉంది. సో.. ఇప్పుడు వైసీపీకి ఆ దెబ్బ తగిలినా ఆశ్చర్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి. మరి దీనిని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…