అభిమానులంటే ప్రాణం.. వాళ్లు లేకపోతే మేం లేము అని అందరు హీరోలు అంటారు. కానీ వారి మీద నిజంగా అందరికీ అంత అభిమానం ఉంటుందా.. వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారా అన్నది సందేహమే. ఇటీవల ప్రభాస్ కృష్ణంరాజు దినం కార్యక్రమం సందర్భంగా లక్ష మందికి పైగానే అభిమానులకు మంచి నాన్ వెజ్ విందు పెట్టి ఫ్యాన్స్ తనకెంత ప్రత్యేకమో చాటుకున్నాడు.
ఇలా అభిమానుల మీద సందర్భాన్ని బట్టి తమ కృతజ్ఞతను చూపించే హీరోలు కొందరున్నారు. ఐతే అందరూ అభిమానుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి వారి పట్ల తమ ప్రేమను చాటాల్సిన అవసరం లేదు. తమను చూడడానికి వచ్చినపుడు కాస్త వీలు చేసుకుని వాళ్లను కలవడం.. వారితో ఫొటోలు దిగడం చేస్తే కూడా వారి కడుపు నిండిపోతుంది.
బాలీవుడ్ లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ముంబయిలోని తన నివాసం వద్ద వారానికి ఒక రోజు అమితాబ్ తన అభిమానులకు దర్శనం ఇస్తాడు. తన కోసం ఓపిగ్గా ఎదురు చూసే వారి కోసం సమయం కేటాయించి వారికి అభివాదం చేస్తాడు. వయసు, అనారోగ్య సమస్యల వల్ల ఫొటోలైతే దిగడు. ఐతే ఇలా అభిమానులను సందర్శించే సమయంలో అమితాబ్ చెప్పులు వేసుకోడన్న సంగతి ఆ సమయంలో ఆయన్ని గమనించిన వారికి తెలిసి ఉంటుంది. దీనికి కారణమేంటో అమితాబ్ తాజాగా వెల్లడించాడు.
అభిమానులంటే తనకు భక్తి అని, వారిని దేవళ్లలా చూస్తానని.. తనను ఇంత వాడిని చేసిన అభిమానులను కలిసేటపుడు వారి మీద తన భక్తిని చాటుకునేందుకే చెప్పులు వేసుకోకుండా వారి ముందు నిలబడతానని అమితాబ్ చెప్పడం విశేషం. ఫ్యాన్స్ విషయంలో ఇంత గౌరవభావం కలిగిన హీరో అమితాబ్ ఒక్కడే అయ్యుంటాడేమో. ఇందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…