అభిమానులంటే ప్రాణం.. వాళ్లు లేకపోతే మేం లేము అని అందరు హీరోలు అంటారు. కానీ వారి మీద నిజంగా అందరికీ అంత అభిమానం ఉంటుందా.. వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారా అన్నది సందేహమే. ఇటీవల ప్రభాస్ కృష్ణంరాజు దినం కార్యక్రమం సందర్భంగా లక్ష మందికి పైగానే అభిమానులకు మంచి నాన్ వెజ్ విందు పెట్టి ఫ్యాన్స్ తనకెంత ప్రత్యేకమో చాటుకున్నాడు.
ఇలా అభిమానుల మీద సందర్భాన్ని బట్టి తమ కృతజ్ఞతను చూపించే హీరోలు కొందరున్నారు. ఐతే అందరూ అభిమానుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి వారి పట్ల తమ ప్రేమను చాటాల్సిన అవసరం లేదు. తమను చూడడానికి వచ్చినపుడు కాస్త వీలు చేసుకుని వాళ్లను కలవడం.. వారితో ఫొటోలు దిగడం చేస్తే కూడా వారి కడుపు నిండిపోతుంది.
బాలీవుడ్ లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ముంబయిలోని తన నివాసం వద్ద వారానికి ఒక రోజు అమితాబ్ తన అభిమానులకు దర్శనం ఇస్తాడు. తన కోసం ఓపిగ్గా ఎదురు చూసే వారి కోసం సమయం కేటాయించి వారికి అభివాదం చేస్తాడు. వయసు, అనారోగ్య సమస్యల వల్ల ఫొటోలైతే దిగడు. ఐతే ఇలా అభిమానులను సందర్శించే సమయంలో అమితాబ్ చెప్పులు వేసుకోడన్న సంగతి ఆ సమయంలో ఆయన్ని గమనించిన వారికి తెలిసి ఉంటుంది. దీనికి కారణమేంటో అమితాబ్ తాజాగా వెల్లడించాడు.
అభిమానులంటే తనకు భక్తి అని, వారిని దేవళ్లలా చూస్తానని.. తనను ఇంత వాడిని చేసిన అభిమానులను కలిసేటపుడు వారి మీద తన భక్తిని చాటుకునేందుకే చెప్పులు వేసుకోకుండా వారి ముందు నిలబడతానని అమితాబ్ చెప్పడం విశేషం. ఫ్యాన్స్ విషయంలో ఇంత గౌరవభావం కలిగిన హీరో అమితాబ్ ఒక్కడే అయ్యుంటాడేమో. ఇందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on November 2, 2022 7:10 pm
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…