కొన్నేళ్ల కిందట సినిమాలు పక్కన పెట్టేసి రాజకీయాల్లో బిజీ అవడం చూసి కమల్ హాసన్ను మళ్లీ వెండితెరపై చూడలేమో అని ఆందోళన చెందారు అభిమానులు. కానీ మంచికో చెడుకో రాజకీయాల్లో కమల్ ఫెయిలయ్యాడు. తిరిగి సినిమాల వైపు తన దృష్టిని మళ్లించాడు. ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ రీఎంట్ర ఇచ్చి తన పేరు మార్మోగిపోయేలా చేశాడు లోకనాయకుడు.
ఇప్పుడు ఆయన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఇండియన్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభం అయింది. ఇంకొన్ని నెలల పాటు కమల్ ఈ సినిమాకే అంకితమై ఉంటాడు. దీని తర్వాత ఆయన విక్రమ-2 చేస్తాడా.. ఇంకేదైనా సినిమాను మొదలుపెడతాడా అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యే సూచనలు కనిపించడం లేదు కాబట్టి కమల్ వేరే చిత్రాన్నే టేకప్ చేసే అవకాశముంది.
ఆ సినిమాకు దర్శకుడు ఖరారైనట్లు తాజా సమాచారం. ‘శతురంగ వేట్టై’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సంచలనం రేపి, ఆ తర్వాత కార్తితో ‘ఖాకి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హెచ్.వినోద్.. కమల్ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ‘ఖాకి’ తర్వాత అతను అజిత్తో వరుసగా నీర్కొండ పార్వై, వలిమై సినిమాలు తీశాడు. అవి మంచి ఫలితాన్నే అందుకున్నాయి. ఇప్పుడు అజిత్తోనే అతను తీస్తున్న ‘తునివు’పై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత కమల్ సినిమా చేయడానికి అతను రెడీ అవుతున్నాడు.
‘విక్రమ్’ మాదిరే ఈ చిత్రాన్ని కూడా కమల్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’లో నిర్మించబోతున్నాడట. వినోద్ శైలికి తగ్ట్లే ఇదొక యాక్షణ్ థ్రిల్లర్ అని సమాచారం. ‘విక్రమ్’తో పాన్ ఇండియా లెవెల్లో కమల్కు తిరిగి మంచి క్రేజ్ వచ్చింది. దీని తర్వాత ‘ఇండియన్-2’తో ఆ క్రేజ్ ఇంకా పెరగొచ్చు. కాబట్టి వినోద్తో కమల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగానే తెరకెక్కే అవకాశముంది.
This post was last modified on November 2, 2022 7:10 pm
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…