వైసీపీలో చాలా మంది నాయకులు తండ్రుల బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. వీరిలో చాలా మంది సీనియర్ల బిడ్డలు ఉండడం గమనా ర్హం. అయితే, వీరిలో ఎవరువిన్ అవుతారు.. ఎవరు ఫెయిల్ అవుతారనే చర్చకన్నా ముందు. అసలు సీఎం జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ప్రశ్న. ఇది ఇంకా తేలలేదు. అయినప్పటికీ.. తగ్గేదేలే అంటూ.. నాయకుల తనయులు దూకుడుగానే ఉన్నారు. ఉమ్మడి కృష్ణాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు దూకుడు మామూలుగాలేదనే టాక్ వినిపిస్తోంది.
నేరుగా వెళ్లి ప్రజలను కలుస్తున్నాడు. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా కిట్టు నిర్వహిస్తున్నాడు. అధికారులతోనూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈయన జోరు చూస్తే కాబోయే ఎమ్మెల్యే అన్నట్టుగానే ఉంది. ఇదే విషయాన్ని బ్యానర్ల రూపంలో ఆయన స్నేహితులు సైతం పెడుతున్నారు. ఇక, మరో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు కూడా దూకుడుగా ఉన్నారు. నరసన్నపేటలో ప్రతి కార్యక్రమంలోనూ తండ్రి వెంటే ఆయన పరుగులు పెడుతున్నారు. అంతేకాదు.. ప్రజలకు కూడా ఆయన కలుస్తూ.. హామీలు గుప్పిస్తున్నారు.
ఇక, స్పీకర్ తమ్మినేని తనయుడు కూడా ఇదే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే, వీరిలో ఎవరికీ కూడా జగన్ టికెట్ ఇస్తానని కానీ, ఇవ్వడం ఖాయమని కానీ చెప్పలేదు. కానీ, తమ మాట జగన్ తీసేయడు అనే ధీమాతోనే వీరు ఇలా చేస్తున్నారనే వాదన అయితే పార్టీలో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇదిలావుంటే, చిత్తూరులో కొందరు నాయకులు కూడా ఇలానే చేస్తున్నారు. తమ కుమారులను కార్యక్రమాలకు పిలుస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా ఆసక్తికర రాజకీయం తెరమీదికి వచ్చింది. మరి చివరకు జగన్ ఏం చేస్తారో చూడాలి.
ఎదుకంటే.. వచ్చే ఎన్నికలు సీరియస్ అవుతున్నాయి. గెలుపు హోరాహోరీ కానుంది. ఇలాంటి సమయంలో జూనియర్లకు ఇచ్చి చేతులు కాల్చుకోకూడదని జగన్ భావిస్తున్నారు. కానీ, వీరు మాత్రం జగన్ ఎందుకు ఇవ్వరు? మేం ఒకటి.. మా వారసులు ఒకటీనా? అని ప్రశ్నించేధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గానే మారింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on November 3, 2022 7:05 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…