ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానుల చర్చలన్నీ తమ హీరో 16వ సినిమా మీదే ఉన్నాయి. చరణ్ తన 15వ సినిమాను శంకర్తో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వాస్తవంగా అయితే ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జట్టు కట్టాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా పట్టాలెక్కడం లేదు. దీని గురించి చరణ్ వ్యక్తిగత పీఆర్వో శివ చెర్రీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. మరి చరణ్.. శంకర్ సినిమా తర్వాత ఎవరితో జట్టు కడతాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే.. చరణ్కు ‘రంగస్థలం’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్ ఇచ్చిన సుకుమార్తోనే తన తర్వాతి సినిమా ఉంటుందని. ఐతే ఇప్పటిదాకా ఈ విషయం ఒక ప్రచారం మాత్రమే కాగా.. తాజాగా తెలిసిన ఒక అప్డేట్ను బట్టి చూస్తుంటే ఈ కలయిక పక్కా అని స్పష్టమవుతోంది.
లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తనయుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ అట. అతను తాజాగా క్లబ్హౌస్ చాట్లో మాట్లాడుతూ.. చరణ్తో తన తర్వాతి సినిమాకు సంబంధించి ఇంట్రోను సుకుమార్ ఆల్రెడీ చిత్రీకరించేశాడట. ఇది ‘ఆర్ఆర్ఆర్’ షూట్కు ముందే జరిగిందట. అది మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ అని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ కోసం చరణ్ పెంచిన బాడీ, లుక్ నచ్చి అలాగే తన కొత్త చిత్రం ఇంట్రో సీన్ తీశాడని.. ఇదే లుక్ తర్వాత కావాల్సి ఉంటుందని కూడా చెప్పాడని సాబు సిరిల్ కొడుకు క్లబ్ హౌస్లో చెప్పినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుుగతోంది. ఇది నమ్మకూడని విషయం లాగా కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల టైంలో రాజమౌళి ఒకసారి మాట్లాడుతూ.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే తర్వాతి సినిమాకు సంబంధించి ఇంట్రో సీన్ తనకు తెలుసని, అది మైండ్ బ్లోయింగ్గా ఉంటుందని అన్నాడు. దీన్ని బట్టి సుక్కు-చరణ్ కలయిక నిజమే అని, వారి నుంచి ‘రంగస్థలం’ను మించిన సినిమా రాబోతోందని ఆశించవచ్చు.
This post was last modified on November 2, 2022 6:52 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…