Movie News

మంటెత్తిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్

అబ్బే ఎంత పోటీ ఉన్నా మాది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి సంక్రాంతికి వచ్చే తీరుతుందన్న అభిమానుల ధీమాని బద్దలు కొడుతూ ఆది పురుష్ వాయిదా వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి టి సిరీస్ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించనే లేదు. కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకుని మీడియా దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నిప్పు లేనిదే పొగరాదు. నిర్మాత చెప్పనిదే పంపిణీదారులు అలా ఎందుకంటారు. సో అఫీషియల్ కావడం జస్ట్ లాంఛనమే. కొత్త డేట్ మార్చ్ లో వచ్చే శ్రీరామనవమిని టార్గెట్ చేసుకుని లాక్ చేస్తారనే లీక్ కూడా చక్కర్లు కొడుతోంది.

ఈ పరిణామాల పట్ల ప్రభాస్ ఫాన్స్ మంటెక్కిపోతున్నారు. బాహుబలి తర్వాత తమ హీరోకు ఏదీ సవ్యంగా జరగడం లేదనేది వాళ్ళ బాధ. అందులో న్యాయం ఉంది. ఇంటర్ నేషనల్ లెవెల్ లో అదరగొడుతుందనుకున్న సాహో తెలుగులోనే సరిగా ఆడలేదు. డిజాస్టర్ గా మిగిలింది. అది కూడా చాలాసార్లు వాయిదా పడుతూ వెళ్ళిందే. రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వడంలోనూ జనాల సహనానికి పెద్ద పరీక్ష పెట్టారు. తీరా రిలీజయ్యాక కనీసం యావరేజ్ కాలేకపోయింది. సరే ఇప్పుడు ఆది పురుష్ ఈ గాయాలన్నీ మాన్పుతుందనుకుంటే టీజర్ తో మొదలు అన్నీ నెగటివ్ వైబ్రేషన్సే.

ప్రస్తుత వాతావరణంలో ఆది పురుష్ కంటే సలార్ రావడమే మేలని వాళ్ళ అభిప్రాయం. గ్రాఫిక్స్ మీద వచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకుని దర్శకుడు ఓం రౌత్ ఏదో అద్భుతం చేస్తాడన్న నమ్మకం పెద్దగా లేదు. ట్రైలర్ కట్ బయటికి వస్తే కానీ దీని గురించి కంక్లూజన్ కు రాలేం. పైగా పాటలెలా కంపోజ్ చేశారో. ఇంతకీ మ్యూజిక్ అందిస్తున్న అజయ్ అతుల్ ల నేపధ్యం ఏమిటో అర్థం కాక హైప్ ఉండాల్సిన స్థాయిలో లేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు ఈ మాత్రం అసహనం కలగడం న్యాయమే. మొత్తానికి పొంగల్ బరిలో నుంచి తప్పుకోవడం డార్లింగ్ ఫ్యాన్స్ కి మింగుడుపడటం లేదు.

This post was last modified on October 31, 2022 5:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

28 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

31 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago