సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ అనే కాక సౌత్ ఇండియాలో మిగతా హీరోలకంటే ముందు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాదు.. ముందు నుంచి చాలా యాక్టివ్గా ఉంటూ ట్రెండును అందిపుచ్చుకున్నాడు. అక్కడ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికీ మహేష్ అంతగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే హీరో మరొకరు కనిపించరు. తన సినిమాలనే కాక వేరే వాళ్ల సినిమాలను ప్రమోట్ చేయడానికి.. ఏవైనా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ట్విట్టర్ను బాగానే ఉపయోగించుకుంటాడు మహేష్. అందుకే ఎప్పటికప్పుడు మహేష్కు ఫాలోవర్లు పెరుగుతుంటారు.
తాజాగా సూపర్ స్టార్ ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించాడు ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 13 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండియా మొత్తంలో మరే సెలబ్రెటీకి కూడా ట్విట్టర్లో ఇంతమంది ఫాలోవర్లు లేకపోవడం గమనార్హం.
దక్షిణాది సినీ పరిశ్రమలో ధనుష్ (11.1 మిలియన్ ఫాలోవర్లు), సమంత (10.1 మిలియన్) మాత్రమే మహేష్ బాబుకు చేరువగా ఉన్నారు. వాళ్లు 13 మిలియన్ల మార్కును అందుకునేలోపు మహేష్ 15 మిలియన్ల మార్కును టచ్ చేస్తాడనడంలో సందేహం లేదు. ఇక రాజమౌళి సినిమా చేశాడంటే మహేష్ 20 మిలియన్ల మైలురాయిని అందుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
ఇక సౌత్లో అత్యధిక ట్విట్టర్ ఫాలోయింగ్ ఉన్న మిగతా స్టార్ల సంగతి చూస్తే.. అల్లు అర్జున్ 7.2 మిలియన్లతో ఉన్నాడు. రానా దగ్గుబాటి (6.5), జూనియర్ ఎన్టీఆర్ (6.4), అక్కినేని నాగార్జున (6.3) రజినీకాంత్ (6.2), రాజమౌళి (6), త్రిష (5.6), పవన్ కళ్యాణ్ (5.4)లకు కూడా ట్విట్టర్లో మంచి ఫాలోయింగే ఉంది. ఐతే వీరిలో చాలామంది ట్విట్టర్లో మరీ యాక్టివ్గా ఏమీ ఉండరు. ట్విట్టర్ ఫాలోవర్లను బట్టి వాళ్ల ఒరిజినల్ ఫాలోయింగ్ను అంచనా వేయడం కూడా కష్టమే. రామ్ చరణ్ బయట పెద్ద స్టార్ అయినా.. అతను ట్విట్టర్లోకి లేటుగా రావడం, పెద్దగా యాక్టివ్గా లేకపోవడం వల్ల 2.7 మిలియన్ ఫాలోవర్లే ఉన్నారు.
This post was last modified on October 28, 2022 9:46 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…