కాంతార.. కాంతార.. కాంతార.. దాదాపు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. ముందు కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఇతర భాషల వాళ్లనూ ఆకర్షిస్తుండడంతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. తెలుగులో తొలి రోజు నుంచి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోందీ చిత్రం. ఇప్పటికే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.40 కోట్లను దాటిపోగా.. షేర్ రూ.20 కోట్లకు చేరువగా ఉంది. హిందీలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
వసూళ్ల సంగతి పక్కన పెడితే ప్రేక్షకుల మీద ఈ సినిమా వేస్తున్న ఇంపాక్ట్ చాలా బలమైనది, ప్రత్యేకమైంది. ఇంతకంటే పెద్ద హిట్ సినిమాలు, భారీ వసూళ్లు సాధించినవి ఉన్నాయి కానీ… ఈ సినిమా చూపిన ప్రభావం చాలా తక్కువ చిత్రాలే చూపించాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని సైతం ఈ సినిమా ఆకర్షించింది.
మోడీ కోసం ‘కాంతార’ స్పెషల్ షో వేయబోతున్నారన్నది తాజా సమాచారం. నవంబరు 14న ‘కాంతార’ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించబోతున్నారట ప్రధాని. మోడీ సినిమాలు చూడడం చాలా చాలా తక్కువ. చివరగా ఆయన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూశారు. ఆ తర్వాత ఆయన కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేయిస్తున్నది ‘కాంతార’ మూవీనే.
కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల ఆచారాలు,అక్కడి వనదేవతలు, భూత కోల నృత్యం.. వీటి చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈ భూత కోల నృత్యకారులకు నెలవారీ భత్యం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. హిందూ ఆచారాలను ప్రమోట్ చేసే సినిమా కావడంతో ప్రధాని కూడా సినిమా చూడాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇందులో రాజకీయ ప్రయోజనం కూడా కొంత దాగి ఉందన్నది స్పష్టం. మరి ఈ సినిమా చూసి మోడీ ఏమని రివ్యూ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 28, 2022 7:42 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…