కాంతార.. కాంతార.. కాంతార.. దాదాపు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. ముందు కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఇతర భాషల వాళ్లనూ ఆకర్షిస్తుండడంతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. తెలుగులో తొలి రోజు నుంచి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోందీ చిత్రం. ఇప్పటికే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.40 కోట్లను దాటిపోగా.. షేర్ రూ.20 కోట్లకు చేరువగా ఉంది. హిందీలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
వసూళ్ల సంగతి పక్కన పెడితే ప్రేక్షకుల మీద ఈ సినిమా వేస్తున్న ఇంపాక్ట్ చాలా బలమైనది, ప్రత్యేకమైంది. ఇంతకంటే పెద్ద హిట్ సినిమాలు, భారీ వసూళ్లు సాధించినవి ఉన్నాయి కానీ… ఈ సినిమా చూపిన ప్రభావం చాలా తక్కువ చిత్రాలే చూపించాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని సైతం ఈ సినిమా ఆకర్షించింది.
మోడీ కోసం ‘కాంతార’ స్పెషల్ షో వేయబోతున్నారన్నది తాజా సమాచారం. నవంబరు 14న ‘కాంతార’ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించబోతున్నారట ప్రధాని. మోడీ సినిమాలు చూడడం చాలా చాలా తక్కువ. చివరగా ఆయన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూశారు. ఆ తర్వాత ఆయన కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేయిస్తున్నది ‘కాంతార’ మూవీనే.
కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల ఆచారాలు,అక్కడి వనదేవతలు, భూత కోల నృత్యం.. వీటి చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈ భూత కోల నృత్యకారులకు నెలవారీ భత్యం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. హిందూ ఆచారాలను ప్రమోట్ చేసే సినిమా కావడంతో ప్రధాని కూడా సినిమా చూడాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇందులో రాజకీయ ప్రయోజనం కూడా కొంత దాగి ఉందన్నది స్పష్టం. మరి ఈ సినిమా చూసి మోడీ ఏమని రివ్యూ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 28, 2022 7:42 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…