కాంతార.. కాంతార.. కాంతార.. దాదాపు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. ముందు కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఇతర భాషల వాళ్లనూ ఆకర్షిస్తుండడంతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. తెలుగులో తొలి రోజు నుంచి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోందీ చిత్రం. ఇప్పటికే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.40 కోట్లను దాటిపోగా.. షేర్ రూ.20 కోట్లకు చేరువగా ఉంది. హిందీలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
వసూళ్ల సంగతి పక్కన పెడితే ప్రేక్షకుల మీద ఈ సినిమా వేస్తున్న ఇంపాక్ట్ చాలా బలమైనది, ప్రత్యేకమైంది. ఇంతకంటే పెద్ద హిట్ సినిమాలు, భారీ వసూళ్లు సాధించినవి ఉన్నాయి కానీ… ఈ సినిమా చూపిన ప్రభావం చాలా తక్కువ చిత్రాలే చూపించాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని సైతం ఈ సినిమా ఆకర్షించింది.
మోడీ కోసం ‘కాంతార’ స్పెషల్ షో వేయబోతున్నారన్నది తాజా సమాచారం. నవంబరు 14న ‘కాంతార’ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించబోతున్నారట ప్రధాని. మోడీ సినిమాలు చూడడం చాలా చాలా తక్కువ. చివరగా ఆయన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూశారు. ఆ తర్వాత ఆయన కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేయిస్తున్నది ‘కాంతార’ మూవీనే.
కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల ఆచారాలు,అక్కడి వనదేవతలు, భూత కోల నృత్యం.. వీటి చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈ భూత కోల నృత్యకారులకు నెలవారీ భత్యం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. హిందూ ఆచారాలను ప్రమోట్ చేసే సినిమా కావడంతో ప్రధాని కూడా సినిమా చూడాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇందులో రాజకీయ ప్రయోజనం కూడా కొంత దాగి ఉందన్నది స్పష్టం. మరి ఈ సినిమా చూసి మోడీ ఏమని రివ్యూ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 28, 2022 7:42 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…