లైగర్ సినిమాకు సంబంధించి నష్టాల భర్తీ విషయంలో ఫినాన్షియర్లు, బయ్యర్లతో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ గొడవ బాగా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. లైగర్ సినిమా కారణంగా దారుణంగా నష్టపోయిన తమకు కొంతమేర నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని పూరి నిలబెట్టుకోకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించడం.. వారికి కొందరు ఫినాన్షియర్లు, ఎగ్జిబిటర్లు కూడా తోడవడం.. ఈ సమాచారం తెలుసుకున్న పూరి వారికి ఫోన్ కాల్ ద్వారా గట్టి వార్నింగ్ ఇవ్వడం.. ఆ కాల్ తాలూకు ఆడియో లీక్ అయి వైరల్ కావడం తెలిసిందే.
తనను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే, తన పరువు తీయాలని చూస్తే ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వబుద్ధి కాదని.. ఎవరు ధర్నా చేస్తారో వారిని మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులిస్తానని పూరి ఈ కాల్లో తేల్చేశాడు. అంతే కాక ఫైనాన్షియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు పూరి.
ఐతే పూరి ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తించాడని అవతలి వర్గం అంటోంది. లైగర్ సినిమా మీద తాము పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు కూడా వెనక్కి రాలేదని.. కొంత మేర నష్టపరిహారం ఇస్తానన్న పూరి ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ధర్నాకు సిద్ధమయ్యామని.. దానికి పూరి అంత తీవ్రంగా స్పందించడమేంటని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా తమను బ్లాక్మెయిల్ చేయాలని, తమ నోళ్లు మూయించాలని పూరి చూస్తున్నాడని.. డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడని ఆ వర్గం ఆరోపిస్తోంది.
టాలీవుడ్ నిర్మాతలు ఇచ్చిన ఎన్నో బౌన్స్ చెక్కులు తమ వద్ద ఉన్నాయని.. తాము కూడా కేసులు పెట్టగలమని ఫైనాన్షియర్ శోభన్ అంటున్నాడు. పూరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఫినాన్షియర్ల సంఘం.. ఇకపై ఆయన సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరిని బాయ్కాట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
This post was last modified on October 27, 2022 10:52 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…