Movie News

పూరి సినిమాల బాయ్‌కాట్?

లైగర్ సినిమాకు సంబంధించి నష్టాల భర్తీ విషయంలో ఫినాన్షియర్లు, బయ్యర్లతో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ గొడవ బాగా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. లైగర్ సినిమా కారణంగా దారుణంగా నష్టపోయిన తమకు కొంతమేర నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని పూరి నిలబెట్టుకోకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించడం.. వారికి కొందరు ఫినాన్షియర్లు, ఎగ్జిబిటర్లు కూడా తోడవడం.. ఈ సమాచారం తెలుసుకున్న పూరి వారికి ఫోన్ కాల్ ద్వారా గట్టి వార్నింగ్ ఇవ్వడం.. ఆ కాల్ తాలూకు ఆడియో లీక్ అయి వైరల్ కావడం తెలిసిందే.

తనను బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తే, తన పరువు తీయాలని చూస్తే ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వబుద్ధి కాదని.. ఎవరు ధర్నా చేస్తారో వారిని మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులిస్తానని పూరి ఈ కాల్‌లో తేల్చేశాడు. అంతే కాక ఫైనాన్షియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు పూరి.

ఐతే పూరి ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తించాడని అవతలి వర్గం అంటోంది. లైగర్ సినిమా మీద తాము పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు కూడా వెనక్కి రాలేదని.. కొంత మేర నష్టపరిహారం ఇస్తానన్న పూరి ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ధర్నాకు సిద్ధమయ్యామని.. దానికి పూరి అంత తీవ్రంగా స్పందించడమేంటని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా తమను బ్లాక్‌మెయిల్ చేయాలని, తమ నోళ్లు మూయించాలని పూరి చూస్తున్నాడని.. డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడని ఆ వర్గం ఆరోపిస్తోంది.

టాలీవుడ్ నిర్మాతలు ఇచ్చిన ఎన్నో బౌన్స్ చెక్కులు తమ వద్ద ఉన్నాయని.. తాము కూడా కేసులు పెట్టగలమని ఫైనాన్షియర్ శోభన్ అంటున్నాడు. పూరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఫినాన్షియర్ల సంఘం.. ఇకపై ఆయన సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరిని బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

This post was last modified on October 27, 2022 10:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

14 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

32 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago