లైగర్ సినిమాకు సంబంధించి నష్టాల భర్తీ విషయంలో ఫినాన్షియర్లు, బయ్యర్లతో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ గొడవ బాగా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. లైగర్ సినిమా కారణంగా దారుణంగా నష్టపోయిన తమకు కొంతమేర నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని పూరి నిలబెట్టుకోకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించడం.. వారికి కొందరు ఫినాన్షియర్లు, ఎగ్జిబిటర్లు కూడా తోడవడం.. ఈ సమాచారం తెలుసుకున్న పూరి వారికి ఫోన్ కాల్ ద్వారా గట్టి వార్నింగ్ ఇవ్వడం.. ఆ కాల్ తాలూకు ఆడియో లీక్ అయి వైరల్ కావడం తెలిసిందే.
తనను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే, తన పరువు తీయాలని చూస్తే ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వబుద్ధి కాదని.. ఎవరు ధర్నా చేస్తారో వారిని మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులిస్తానని పూరి ఈ కాల్లో తేల్చేశాడు. అంతే కాక ఫైనాన్షియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు పూరి.
ఐతే పూరి ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తించాడని అవతలి వర్గం అంటోంది. లైగర్ సినిమా మీద తాము పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు కూడా వెనక్కి రాలేదని.. కొంత మేర నష్టపరిహారం ఇస్తానన్న పూరి ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ధర్నాకు సిద్ధమయ్యామని.. దానికి పూరి అంత తీవ్రంగా స్పందించడమేంటని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా తమను బ్లాక్మెయిల్ చేయాలని, తమ నోళ్లు మూయించాలని పూరి చూస్తున్నాడని.. డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడని ఆ వర్గం ఆరోపిస్తోంది.
టాలీవుడ్ నిర్మాతలు ఇచ్చిన ఎన్నో బౌన్స్ చెక్కులు తమ వద్ద ఉన్నాయని.. తాము కూడా కేసులు పెట్టగలమని ఫైనాన్షియర్ శోభన్ అంటున్నాడు. పూరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఫినాన్షియర్ల సంఘం.. ఇకపై ఆయన సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరిని బాయ్కాట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
This post was last modified on October 27, 2022 10:52 pm
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…