Movie News

పండగ పటాసుల్లో గెలుపు ఎవరిది

దీపావళికి వచ్చిన కొత్త సినిమాల హడావిడి పూర్తి కావొస్తోంది. రేపు శుక్రవారం చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు మళ్ళీ ఇవే ఆప్షన్లుగా మిగలనున్నాయి. మొత్తం నాలుగు బరిలో దిగితే వాటిలో విజేత ఎవరనే ఆసక్తి కలగడం సహజం. నిజానికి దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా బ్రేక్ ఈవెన్ కోణంలో కమర్షియల్ సక్సెస్ కొలుస్తారు కాబట్టి ఆ లెక్కలో చూస్తే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన కార్తీ సర్దారే విన్నర్ గా మొదటి స్థానం అందుకున్నాడు. అయిదున్నర కోట్ల షేర్ ని టార్గెట్ పెట్టుకుని బరిలో దిగిన ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం ఆరు కోట్లకు దగ్గరగా ఉంది. సో లాభాలు మొదలైపోయాయి.

ఓరి దేవుడా వీకెండ్ కాగానే నెమ్మదించినప్పటికీ ఇంకో వారాంతం చేతిలో ఉంది కాబట్టి సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది లక్ష్యంగా పెట్టుకున్న ఆరు కోట్ల షేర్ లో ఇంకో కోటిన్నర వస్తే బయ్యర్లు గట్టెక్కుతారు. విశ్వక్ సేన్ బృందం అందుకే ప్రమోషన్లు ఆపకుండా కొనసాగిస్తోంది. ప్రిన్స్ మాత్రం ఏటికి ఎదురీదుతోంది. శివకార్తికేయన్ కు పెద్దగా మార్కెట్ లేనప్పటికీ ముగ్గురు అగ్ర నిర్మాతలు చేతులు కలపడం, జాతిరత్నాలు కార్డుతో దర్శకుడు అనుదీప్ ని మార్కెటింగ్ చేయడం వీక్ కంటెంట్ కి ఉపయోగపడలేదు. ఫలితంగా నాలుగు కోట్లకు పైగా నష్టం తప్పకపోవచ్చని టాక్.

ఇక జిన్నా గురించి చెప్పేందుకు ఏమీ లేదు. నాలుగు కోట్ల లోపే అమ్మినా కూడా కోటి షేర్ రాబట్టలేక పోరాడుతోంది. మంచు విష్ణు గత చిత్రాలంత డిజాస్టర్ టాక్ రాకపోయినా టీమ్ ప్రమోట్ చేసినట్టు ఢీ రేంజ్ కంటెంట్ లో సగం కూడా లేకపోవడంతో జనం దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. సో ఎలా చూసుకున్నా సర్దార్ దే దీపావళి సింహాసనం. ఈ రెస్పాన్స్ చూసే నిర్మాతలు సీక్వెల్ కి సిద్దపడిపోయారు. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే అక్కడితో వదిలేసేవారు కానీ ఇప్పుడు దర్శకుడు పిఎస్ మిత్రన్ విదేశాల్లో కొనసాగే గూఢచారి కథను కొనసాగించబోతున్నారు. మొత్తానికి డబ్బింగ్ సినిమాదే పైచేయి అయ్యింది.

This post was last modified on October 27, 2022 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago