గత వారం విడుదలైన ‘కాంతార’ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. విడుదలకు ముందే మంచి బజ తెచ్చుకుని, డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్స్తో ఈ సినిమా ఆశ్చర్యపరిచింది. ఇక గత శనివారం రిలీజ్ రోజు అదిరిపోయే టాక్ రావడంతో సాయంత్రానికి ఈ సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అయింది. ఆదివారం డిమాండ్ పెరిగిపోవడంతో స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. వీక్ డేస్లో కూడా వీక్ అవ్వకుండా మంచి వసూళ్లతో సాగిన ఈ చిత్రానికి గత శుక్రవారం అనూహ్యంగా బ్రేక్ పడింది. ఆ రోజు ఒకేసారి ఐదు కొత్త సినిమాలు రిలీజవడంతో ‘కాంతార’కు స్క్రీన్లు తగ్గించక తప్పలేదు.
మల్టీప్లెక్సుల్లో ‘బ్లాక్ ఆడమ్’ మూవీ ‘కాంతార’ స్క్రీన్లు, షోలకు బాగా గండి కొట్టింది. సింగిల్ స్క్రీన్ల నుంచి ఈ సినిమాను లేపేసి ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్, సర్దార్ చిత్రాలకు కేటాయించాల్సి వచ్చింది. హైదరాబాద్ లాంటి చోట్ల ‘కాంతార’కు మంచి వసూళ్లు వస్తున్న పెద్ద థియేటర్ల నుంచి దాన్ని తీసేశారు.
ఐతే ‘కాంతార’ను రీప్లేస్ చేసిన సినిమాలు ఏవీ కూడా దాని స్థాయిలో వసూళ్లు రాబట్టట్లేదు. కొత్త చిత్రాల్లో ‘సర్దార్’ ఒక్కటే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు సాయంత్రానికి ఆ సినిమా బాగా పుంజుకుంది. ‘ఓరిదేవుడా’కు మంచి టాకే వచ్చినా అందుకు తగ్గట్లుగా వసూళ్లు లేవు. ‘ప్రిన్స్’ హడావుడి శుక్రవారం మార్నింగ్ షోలకే పరిమితం అయింది. డివైడ్ టాక్ వల్ల ఈ సినిమా వసూళ్లు పడిపోయాయి. సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక మంచు విష్ణు సినిమా ‘జిన్నా’కు టాక్ బాగానే ఉన్నా.. ఈ పోటీ మధ్య ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అటెన్షన్ దక్కట్లేదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో భారీ వసూళ్లు సాధిస్తున్న సంధ్య థియేటర్ నుంచి ‘కాంతార’ను తీసేసి.. నారాయణగూడలోని శాంతికి ఆ సినిమాను పరిమితం చేశారు. ఇప్పుడు సంధ్యలో ఆడుతున్న రెండు సినిమాలు ప్రిన్స్, జిన్నా కలిపి కూడా ‘కాంతార’ గురువారం వరకు ఒక్కో షోకు రాబట్టిన వసూళ్లు తెచ్చుకోలేకపోతున్నాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమాకు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…