టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి నాగ్ నటించిన కుబేర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కూలీలో విలన్ పాత్ర పోషించిన నాగ్కు నిరాశ తప్పలేదు. ప్రి రిలీజ్ హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా కూలీ తీవ్ర నిరాశకు గురి చేసింది.
నాగ్ పాత్ర విషయంలో ఎంతో ఊహించుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఈ సినిమాలో నాగ్ క్యారెక్టర్ గురించి రిలీజ్ ముంగిట దర్శకుడు లోకేష్ కనకరాజ్ మామూలు హైప్ ఇవ్వలేదు. చివరికి చూస్తే.. అంతన్నాడింతన్నాడే.. పాట గుర్తుకొచ్చింది నాగ్ క్యారెక్టర్ చూసి.
తమిళ హీరోలు తెలుగు దర్శకుల వైపు చూస్తుంటే.. నాగ్ చిత్రంగా వరుసగా తన రెండో సినిమాను కూడా తమిళ దర్శకుడితోనే చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా అది నాగ్ వందో సినిమా కావడం గమనార్హం.
తమిళ యువ దర్శకుడైన రా.కార్తీక్.. నాగ్ మైల్ స్టోన్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడని రా.కార్తీక్.. తొలిసారి తమిళ మీడియాతో మాట్లాడాడు. అతను నాగ్కు ఎలవేషన్ ఇచ్చాడు. నాగ్ వందో సినిమా చిత్రీకరణ ప్రస్తుతం నాన్స్టాప్గా జరుగుతోందని చెప్పిన కార్తీక్.. ఈ సినిమాలో నాగ్ సూపర్ స్టైలిష్గా కనిపిస్తాడని చెప్పాడు.
శివ, రక్షకుడు, కూలీ సినిమాల్లో ఎలా అయితే స్టైలిష్ అవతారంలో కనిపించాడో.. అంతే అందంగా ఈ సినిమాలోనూ ఉంటాడన్నాడు. ఈ సినిమాలో నాగ్ మల్టిపుల్ గెటప్స్లో కనిపిస్తాడని కూడా కార్తీక్ వెల్లడించాడు. వందో సినిమాకు తెలుగు దర్శకుడిని కాక, తమిళుడైన తననే ఎందుకు ఎంచుకున్నారని అడిగితే.. నీతో నాకు ఓకే అని నాగ్ చెప్పినట్లు కార్తీక్ తెలిపాడు.
తన కెరీర్ ఆరంభంలోనే మణిరత్నం సార్తో గీతాంజలి చేసిన విషయాన్ని నాగ్ గుర్తు చేసినట్లు కార్తీక్ వెల్లడించాడు. నాగ్ గురించి కార్తీక్ ఇచ్చిన ఎలివేషన్ బాగుంది కానీ.. లోకేష్ కనకరాజ్లా విషయం తక్కువ బిల్డప్ ఎక్కువలా కాకుండా మంచి పాత్ర, సినిమాతో నాగ్ మైల్స్టోన్ మూవీని మెమొరబుల్గా మార్చాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on March 11, 2026 1:26 am
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…