దీపావళి పండగ వచ్చేస్తోంది. ఇదే సమయంలో తను చేసిన మరో రీమేక్ ‘మిలి’ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టేసింది బాలీవుడ్ నెరజాణ జాన్వి కపూర్. అయితే అమ్మడు ప్రమోషన్లు అంటే చాలు.. తన అందాల పరువాలతో బాలీవుడ్ ను పీకల్లతో మైకంలో నింపేస్తుంది. ఇప్పుడు కూడా ఓ వారం నుండి అలాంటి ఓ ట్రీట్మెంట్ తో బాలీవుడ్ చూపరులకు నిద్రపట్టకుండా చేస్తోంది.
ఎర్రటి జలపాతంలా కనిపించే చీరలోనైనా.. కళ్లలో మెరుపులు మెరిపించే పింక్ రంగు లెహంగా అయినా.. ఆమె నల్లటి కనుబొమ్మల రంగులోనున్న మోడ్రన్ డ్రస్ అయినా.. ఎమరాల్డ్ సొగసులతో మెరిసిపోతున్న మరో సాంప్రదాయకంగా కనిపించే బట్టలోనైనా.. డీప్ నెక్ డిజైన్లతో తన అందచందాలను దారపోస్తోంది జాన్వి కపూర్. అసలే దివాళి సీజన్ కావడం.. జనాలందరూ రకరకాల టపాసుల కాంతులను చూడ్డానికి మానసికంగా ఉల్లాసంగా ప్రిపేర్ అవుతున్నవేళ.. దివంగత శ్రీదేవి పెద్దకూతురు మాత్రం ఆ తారరవళి తాలూకు కాంతులను తన కవ్వించే అందాలతో రోజుకోరకంగా విరబూయిస్తోంది. ఇలాంటి సొగసులను చూసి యువత తమనితాము అదుపుచేసుకోలేక ఊహాలోకంలో వైల్డ్ డ్రీమ్స్ లో మునిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే చాలు.. తమ అందచందాలతో ట్రెండింగ్ లో ఎలా ఉండాలో జాన్వి కపూర్ వంటి భామలకు తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి. మామూలు టైములో సింపుల్ టీషర్ట్ జీన్స్ లో కనిపించే జాన్వి.. ఇప్పుడు మాత్రం అటెన్షన్ కోసం అందాలను ఆరబోయడంలో హాలీవుడ్ భామలను మించిపోతోంది. ఇదే రూటులో అనన్య పాండే, దిశా పటానీ వంటి భామలు కూడా ప్రమోషన్ల సమయంలో రెచ్చిపోతుంటారు. ఏదేమైనా కూడా.. ఇలాంటి గిమ్మిక్కులన్నీ యువతకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాయి కాని బాక్సీఫీస్ దగ్గర సినిమాలకు కాసులు కురిపించట్లేదు.
This post was last modified on October 21, 2022 5:05 pm
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…