కొన్ని సినిమాలు అందర్నీ గాట్టిగానే టచ్ చేస్తాయ్. అలా ప్రస్తుతం కంటెంట్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్న సినిమా ‘కాంతారా’. ఒక మారుమూల ట్రైబల్ విలేజ్ లో ఉన్న ఒక దేవత లేదా దేవుని గురించి కథ చెబితే ఎవరు చూస్తారు అని చాలామంది హీరోలూ నిర్మాతలూ ఇటువంటి కథలే టచ్ చెయ్యరు. కాని అలాంటి కథను కూడా ఎంటర్టయిన్మెట్ జోడించి ఒక థ్రిల్లర్ తరహాలో నెరేట్ చేస్తే ఎలా ఉంటుంది చేసి చూపించాడు హీరో-డైరక్టర్ రిషబ్ షెట్టి. అందుకే ఇప్పుడు మనోడ్ని ఇండియాలో అసలు పొగడని నోరంటూ కనిపించట్లేదు.
కాంతారా సినిమా చూసిన తరువాత స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఈ సినిమాను చూశాక అస్సలు హీరో అండ్ డైరక్టర్ ను ఎప్రిషియేట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నానంటూ అమ్మడు సోషల్ మీడియాలో సెలవిచ్చింది. అంతే కాదు, అసలు ఈ సినిమా తాలూకు ఎఫెక్ట్ నుండి రికవరీ అవ్వడానికి ఏకంగా ఓ వారంరోజులు పడుతుందని కూడా చెప్పింది. పైగా తను కూడా డైరక్షన్ చేస్తూ హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసింది కాబట్టి, అలాంటి రెండు పనులూ తామే చేస్తూ హిట్టు కొట్టడం ఎంత కష్టమో ఆమెకు బాగా తెలుసు. అందుకేనేమో కాంతారా సినిమా గురించి చాలా స్పెషల్ గా చెబుతోంది. మరి రికవర్ అయిన తరువాత ఈ తరహా సినిమా ఏమన్నా అమ్మడు ప్లాన్ చేస్తుందేమో చూడాలి.
ఇకపోతే అప్పట్లో కార్తికేయ2 సినిమా హిందీలో చాలా పెద్ద హిట్టే అయ్యింది. దానితో పోల్చిచూస్తే కాంతారా సినిమాకు కలక్షన్లు ఇంకాస్త పికప్ అవ్వాల్సిందే. కాకపోతే హిందీలో మాత్రం అస్సలు ప్రచారం అనేదే లేకుండా కాంతారా రెచ్చిపోతోంది. పైగా చుట్టూ చాలా పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు ఉన్నా కూడా.. కాంతారా మాత్రం మొదటివారంలోనే ₹15 కోట్ల నెట్ కలక్షన్ కొల్లగొట్టేసింది. చూస్తుంటే తెలుగు అండ్ హిందీలో కలిపి ఎలాగైనా నిర్మాతలకు ఓ 30 కోట్లు ఈజీగా ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తోంది.
This post was last modified on October 21, 2022 4:55 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…