దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 21న నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో రెండు తమిళ్ సినిమాలు కాగా మరో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు. కార్తి ‘సర్దార్’తో పాటు శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ కూడా దివాళి కానుకగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో దీపావళి రోజు ఈ రెండు సినిమాలతో పోటీ పడుతున్న కుర్ర హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా పోటీ పడబోతున్నారు.
కార్తి ‘సర్దార్’ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కింది. దీనికి జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా శివ కార్తికేయన్ ప్రీవియస్ రెండు సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే ప్రిన్స్ పై అంచనలు ఏర్పడ్డాయి. ఇక సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ చేయడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. కాకపోతే ప్రమోషన్స్ పరంగా ఇద్దరూ స్లో గానే ఉన్నారు.
అక్టోబర్ 21న విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, విష్ణు మంచు ‘జిన్నా’ కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ అందరి చూపు కోలీవుడ్ హీరోలపైనే ఉంది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కుర్ర హీరోలు ఎలా అలరిస్తారు ? ఇక్కడ అక్కడ ఎలాంటి హిట్స్ అందుకుంటారు అనేది టాపిక్ అవుతుంది. మరి దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిచ్చుబుడ్డిలా పేలే కోలీవుడ్ హీరో ఎవరో చూడాలి.
This post was last modified on October 19, 2022 5:59 pm
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…