దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 21న నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో రెండు తమిళ్ సినిమాలు కాగా మరో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు. కార్తి ‘సర్దార్’తో పాటు శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ కూడా దివాళి కానుకగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో దీపావళి రోజు ఈ రెండు సినిమాలతో పోటీ పడుతున్న కుర్ర హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా పోటీ పడబోతున్నారు.
కార్తి ‘సర్దార్’ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కింది. దీనికి జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా శివ కార్తికేయన్ ప్రీవియస్ రెండు సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే ప్రిన్స్ పై అంచనలు ఏర్పడ్డాయి. ఇక సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ చేయడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. కాకపోతే ప్రమోషన్స్ పరంగా ఇద్దరూ స్లో గానే ఉన్నారు.
అక్టోబర్ 21న విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, విష్ణు మంచు ‘జిన్నా’ కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ అందరి చూపు కోలీవుడ్ హీరోలపైనే ఉంది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కుర్ర హీరోలు ఎలా అలరిస్తారు ? ఇక్కడ అక్కడ ఎలాంటి హిట్స్ అందుకుంటారు అనేది టాపిక్ అవుతుంది. మరి దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిచ్చుబుడ్డిలా పేలే కోలీవుడ్ హీరో ఎవరో చూడాలి.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…