దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 21న నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో రెండు తమిళ్ సినిమాలు కాగా మరో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు. కార్తి ‘సర్దార్’తో పాటు శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ కూడా దివాళి కానుకగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో దీపావళి రోజు ఈ రెండు సినిమాలతో పోటీ పడుతున్న కుర్ర హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా పోటీ పడబోతున్నారు.
కార్తి ‘సర్దార్’ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కింది. దీనికి జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా శివ కార్తికేయన్ ప్రీవియస్ రెండు సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే ప్రిన్స్ పై అంచనలు ఏర్పడ్డాయి. ఇక సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ చేయడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. కాకపోతే ప్రమోషన్స్ పరంగా ఇద్దరూ స్లో గానే ఉన్నారు.
అక్టోబర్ 21న విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, విష్ణు మంచు ‘జిన్నా’ కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ అందరి చూపు కోలీవుడ్ హీరోలపైనే ఉంది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కుర్ర హీరోలు ఎలా అలరిస్తారు ? ఇక్కడ అక్కడ ఎలాంటి హిట్స్ అందుకుంటారు అనేది టాపిక్ అవుతుంది. మరి దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిచ్చుబుడ్డిలా పేలే కోలీవుడ్ హీరో ఎవరో చూడాలి.
This post was last modified on October 19, 2022 5:59 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…