దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 21న నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో రెండు తమిళ్ సినిమాలు కాగా మరో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు. కార్తి ‘సర్దార్’తో పాటు శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ కూడా దివాళి కానుకగా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో దీపావళి రోజు ఈ రెండు సినిమాలతో పోటీ పడుతున్న కుర్ర హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా పోటీ పడబోతున్నారు.
కార్తి ‘సర్దార్’ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కింది. దీనికి జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా శివ కార్తికేయన్ ప్రీవియస్ రెండు సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే ప్రిన్స్ పై అంచనలు ఏర్పడ్డాయి. ఇక సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ చేయడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. కాకపోతే ప్రమోషన్స్ పరంగా ఇద్దరూ స్లో గానే ఉన్నారు.
అక్టోబర్ 21న విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, విష్ణు మంచు ‘జిన్నా’ కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ అందరి చూపు కోలీవుడ్ హీరోలపైనే ఉంది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కుర్ర హీరోలు ఎలా అలరిస్తారు ? ఇక్కడ అక్కడ ఎలాంటి హిట్స్ అందుకుంటారు అనేది టాపిక్ అవుతుంది. మరి దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిచ్చుబుడ్డిలా పేలే కోలీవుడ్ హీరో ఎవరో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…