గాడ్ఫాదర్ విడుదలకు ముందు మీడియాలో ఈ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేవంటూ వార్తలు రావడం పట్ల తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో, ఎలా రిలీజ్ చేసుకోవాలో తమకు తెలియదా, మీడియా ఇలా వార్తలు రాయడం ఏంటి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో థియేట్రికల్ రన్ చాలా తక్కువ రో్జులకు పరిమితం అయిపోయి, తొలి వీకెండ్ వసూళ్లు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సినిమాకు హైప్ తీసుకురావడం చాలా ముఖ్యం. ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాలో వార్తలు రావడం చిరుకు తప్పుగా అనిపించడం విడ్డూరం.
గాడ్ఫాదర్ మీద చిరు టీంకు ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఈ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదన్నది వాస్తవం. ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దసరా సీజన్లో ఇంకా ఎక్కువ వసూళ్లే రాబట్టాల్సింది.
గాడ్ఫాదర్ టీం రిలీజ్ ప్లానింగ్ ఎంత పూర్గా ఉందో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. తెలుగు సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజయ్యే చెన్నైలో అసలీ సినిమా గత వారం విడుదలే కాలేదు. వారం లేటుగా ఈ గురువారం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యుఎస్లో లొకేషన్లు, షోలు ఖరారు చేయడంలో, ప్రిమియర్స్ ప్లానింగ్, ప్రమోషన్లలో చాలా ఆలస్యం జరిగింది. దీని వల్ల తొలి వారాంతంలో ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీకి ఎంత వసూళ్లు వచ్చాయో గాడ్ఫాదర్ లాంటి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీకి కూడా అంతే కలెక్షన్లు వచ్చాయి.
తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు సరైన సమయంలో సెన్సార్ చేయించలేకపోయారు. రిలీజ్ ప్లానింగ్లో పూర్తిగా తేలిపోయారు. దీంతో అక్కడ నామమాత్రంగా సినిమా రిలీజైంది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. ఇలా ఇన్ని లోపాలు ఉండబట్టే గాడ్ఫాదర్ ఇంకా బ్రేక్ ఈవెన్కు చాలా దూరంలో ఉంది. లేదంటే ఈపాటికి బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేసేవారు.
This post was last modified on October 10, 2022 10:50 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…