గాడ్ఫాదర్ విడుదలకు ముందు మీడియాలో ఈ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేవంటూ వార్తలు రావడం పట్ల తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో, ఎలా రిలీజ్ చేసుకోవాలో తమకు తెలియదా, మీడియా ఇలా వార్తలు రాయడం ఏంటి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో థియేట్రికల్ రన్ చాలా తక్కువ రో్జులకు పరిమితం అయిపోయి, తొలి వీకెండ్ వసూళ్లు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సినిమాకు హైప్ తీసుకురావడం చాలా ముఖ్యం. ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాలో వార్తలు రావడం చిరుకు తప్పుగా అనిపించడం విడ్డూరం.
గాడ్ఫాదర్ మీద చిరు టీంకు ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఈ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదన్నది వాస్తవం. ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దసరా సీజన్లో ఇంకా ఎక్కువ వసూళ్లే రాబట్టాల్సింది.
గాడ్ఫాదర్ టీం రిలీజ్ ప్లానింగ్ ఎంత పూర్గా ఉందో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. తెలుగు సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజయ్యే చెన్నైలో అసలీ సినిమా గత వారం విడుదలే కాలేదు. వారం లేటుగా ఈ గురువారం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యుఎస్లో లొకేషన్లు, షోలు ఖరారు చేయడంలో, ప్రిమియర్స్ ప్లానింగ్, ప్రమోషన్లలో చాలా ఆలస్యం జరిగింది. దీని వల్ల తొలి వారాంతంలో ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీకి ఎంత వసూళ్లు వచ్చాయో గాడ్ఫాదర్ లాంటి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీకి కూడా అంతే కలెక్షన్లు వచ్చాయి.
తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు సరైన సమయంలో సెన్సార్ చేయించలేకపోయారు. రిలీజ్ ప్లానింగ్లో పూర్తిగా తేలిపోయారు. దీంతో అక్కడ నామమాత్రంగా సినిమా రిలీజైంది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. ఇలా ఇన్ని లోపాలు ఉండబట్టే గాడ్ఫాదర్ ఇంకా బ్రేక్ ఈవెన్కు చాలా దూరంలో ఉంది. లేదంటే ఈపాటికి బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేసేవారు.
This post was last modified on October 10, 2022 10:50 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…