గాడ్ఫాదర్ విడుదలకు ముందు మీడియాలో ఈ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేవంటూ వార్తలు రావడం పట్ల తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో, ఎలా రిలీజ్ చేసుకోవాలో తమకు తెలియదా, మీడియా ఇలా వార్తలు రాయడం ఏంటి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో థియేట్రికల్ రన్ చాలా తక్కువ రో్జులకు పరిమితం అయిపోయి, తొలి వీకెండ్ వసూళ్లు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సినిమాకు హైప్ తీసుకురావడం చాలా ముఖ్యం. ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాలో వార్తలు రావడం చిరుకు తప్పుగా అనిపించడం విడ్డూరం.
గాడ్ఫాదర్ మీద చిరు టీంకు ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఈ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదన్నది వాస్తవం. ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దసరా సీజన్లో ఇంకా ఎక్కువ వసూళ్లే రాబట్టాల్సింది.
గాడ్ఫాదర్ టీం రిలీజ్ ప్లానింగ్ ఎంత పూర్గా ఉందో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. తెలుగు సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజయ్యే చెన్నైలో అసలీ సినిమా గత వారం విడుదలే కాలేదు. వారం లేటుగా ఈ గురువారం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యుఎస్లో లొకేషన్లు, షోలు ఖరారు చేయడంలో, ప్రిమియర్స్ ప్లానింగ్, ప్రమోషన్లలో చాలా ఆలస్యం జరిగింది. దీని వల్ల తొలి వారాంతంలో ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీకి ఎంత వసూళ్లు వచ్చాయో గాడ్ఫాదర్ లాంటి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీకి కూడా అంతే కలెక్షన్లు వచ్చాయి.
తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు సరైన సమయంలో సెన్సార్ చేయించలేకపోయారు. రిలీజ్ ప్లానింగ్లో పూర్తిగా తేలిపోయారు. దీంతో అక్కడ నామమాత్రంగా సినిమా రిలీజైంది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. ఇలా ఇన్ని లోపాలు ఉండబట్టే గాడ్ఫాదర్ ఇంకా బ్రేక్ ఈవెన్కు చాలా దూరంలో ఉంది. లేదంటే ఈపాటికి బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేసేవారు.
This post was last modified on October 10, 2022 10:50 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…