ప్రముఖ సినీ నటుడు కమ్ ప్రిన్స్ గా పిలుచుకునే మహేశ్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేసిన ఒక వ్యక్తి ఉదంతం కలకలాన్ని రేపింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జూబ్లీహిల్స్ లో మహేశ్ బాబు నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రహరీగోడను నిర్మించారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి పెద్ద శబ్ధం వచ్చినంతనే.. సెక్యురిటీ గార్డులు.. ఆ శబ్ధం వచ్చిన వైపు వెళ్లగా.. గుర్తు తెలియని ఆగంతకుడు ఒకడు తీవ్ర గాయాల పాలై పడిపోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన ఇతడ్ని క్రిష్ణగా గుర్తించారు. దొంగతనం చేసేందుకు వచ్చిన అతడు.. ఎత్తైన ప్రహరీ గోడ ఎక్కి కిందకు దూకాడు. అంచనా తప్పటంతో తీవ్ర గాయాల పాలు అయ్యాడు.
మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చిన అతను.. దొంగతనం చేసేందుకు వీలుగా సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా మహేశ్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేసుకున్నాడు కానీ.. అంచనాలు తప్పి తీవ్ర గాయాలై..ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో మహేశ్ బాబు ఇంట్లో లేరు. సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
This post was last modified on September 29, 2022 10:29 am
తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…
టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…
తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి 3(30 లక్షల కోట్ల రూపాయలు) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా…
కాంగ్రెస్ అగ్రనేతే కాదు.. లోక్సభలో విపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్గాంధీ.. తరచుగా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు…
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…