ప్రముఖ సినీ నటుడు కమ్ ప్రిన్స్ గా పిలుచుకునే మహేశ్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేసిన ఒక వ్యక్తి ఉదంతం కలకలాన్ని రేపింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జూబ్లీహిల్స్ లో మహేశ్ బాబు నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రహరీగోడను నిర్మించారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి పెద్ద శబ్ధం వచ్చినంతనే.. సెక్యురిటీ గార్డులు.. ఆ శబ్ధం వచ్చిన వైపు వెళ్లగా.. గుర్తు తెలియని ఆగంతకుడు ఒకడు తీవ్ర గాయాల పాలై పడిపోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన ఇతడ్ని క్రిష్ణగా గుర్తించారు. దొంగతనం చేసేందుకు వచ్చిన అతడు.. ఎత్తైన ప్రహరీ గోడ ఎక్కి కిందకు దూకాడు. అంచనా తప్పటంతో తీవ్ర గాయాల పాలు అయ్యాడు.
మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చిన అతను.. దొంగతనం చేసేందుకు వీలుగా సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా మహేశ్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేసుకున్నాడు కానీ.. అంచనాలు తప్పి తీవ్ర గాయాలై..ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో మహేశ్ బాబు ఇంట్లో లేరు. సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
This post was last modified on September 29, 2022 10:29 am
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…