రాజకీయాల్లోకి ఫుల్ టైం వెళ్ళిపోయాక ఇక మళ్ళీ సినిమాల వైపు చూడనని చెప్పిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకోవడానికి కారణం ఆర్థిక లెక్కలే. పవర్లో లేకుండా పార్టీని నడిపించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, సినిమాకు యాభై కోట్ల పారితోషికం ఇస్తామని అంటున్న నిర్మాతలు పవన్ ని ఇటు టెంప్ట్ చేసారు.
మళ్ళీ ఎన్నికల హంగామా మొదలవడానికి సమయం ఉంది కనుక ఈలోగా ఒక అరడజను సినిమాలు చేసి 300 కోట్లు సంపాదిస్తే తదుపరి ఎన్నికల వేళ ప్రచారానికి, సెక్యూరిటీ, మెయింటెనెన్సు తదితర ఖర్చులకు పనికొస్తుందని పవన్ భావించాడు. ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కానీ ఆ రెండు సినిమాలు పూర్తయి బయటకు రావడానికి వచ్చే ఏడాది కూడా గడచిపోయేట్టు ఉంది.
హరీష్ శంకర్ తో మైత్రి మూవీస్ సినిమా చేసిన తర్వాత ఇక పవన్ కి వేరే సినిమాలు చేసే తీరిక ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఎన్నికలకు లేట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈసారి ఆ తప్పు చేయకపోవచ్చు కనుక సినిమాల్లో ఏమి చేసినా వచ్చే రెండేళ్లలోనే చేయాలి.
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…