రాజకీయాల్లోకి ఫుల్ టైం వెళ్ళిపోయాక ఇక మళ్ళీ సినిమాల వైపు చూడనని చెప్పిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకోవడానికి కారణం ఆర్థిక లెక్కలే. పవర్లో లేకుండా పార్టీని నడిపించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, సినిమాకు యాభై కోట్ల పారితోషికం ఇస్తామని అంటున్న నిర్మాతలు పవన్ ని ఇటు టెంప్ట్ చేసారు.
మళ్ళీ ఎన్నికల హంగామా మొదలవడానికి సమయం ఉంది కనుక ఈలోగా ఒక అరడజను సినిమాలు చేసి 300 కోట్లు సంపాదిస్తే తదుపరి ఎన్నికల వేళ ప్రచారానికి, సెక్యూరిటీ, మెయింటెనెన్సు తదితర ఖర్చులకు పనికొస్తుందని పవన్ భావించాడు. ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కానీ ఆ రెండు సినిమాలు పూర్తయి బయటకు రావడానికి వచ్చే ఏడాది కూడా గడచిపోయేట్టు ఉంది.
హరీష్ శంకర్ తో మైత్రి మూవీస్ సినిమా చేసిన తర్వాత ఇక పవన్ కి వేరే సినిమాలు చేసే తీరిక ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఎన్నికలకు లేట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈసారి ఆ తప్పు చేయకపోవచ్చు కనుక సినిమాల్లో ఏమి చేసినా వచ్చే రెండేళ్లలోనే చేయాలి.
This post was last modified on July 8, 2020 7:14 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…