రాజకీయాల్లోకి ఫుల్ టైం వెళ్ళిపోయాక ఇక మళ్ళీ సినిమాల వైపు చూడనని చెప్పిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకోవడానికి కారణం ఆర్థిక లెక్కలే. పవర్లో లేకుండా పార్టీని నడిపించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, సినిమాకు యాభై కోట్ల పారితోషికం ఇస్తామని అంటున్న నిర్మాతలు పవన్ ని ఇటు టెంప్ట్ చేసారు.
మళ్ళీ ఎన్నికల హంగామా మొదలవడానికి సమయం ఉంది కనుక ఈలోగా ఒక అరడజను సినిమాలు చేసి 300 కోట్లు సంపాదిస్తే తదుపరి ఎన్నికల వేళ ప్రచారానికి, సెక్యూరిటీ, మెయింటెనెన్సు తదితర ఖర్చులకు పనికొస్తుందని పవన్ భావించాడు. ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కానీ ఆ రెండు సినిమాలు పూర్తయి బయటకు రావడానికి వచ్చే ఏడాది కూడా గడచిపోయేట్టు ఉంది.
హరీష్ శంకర్ తో మైత్రి మూవీస్ సినిమా చేసిన తర్వాత ఇక పవన్ కి వేరే సినిమాలు చేసే తీరిక ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఎన్నికలకు లేట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈసారి ఆ తప్పు చేయకపోవచ్చు కనుక సినిమాల్లో ఏమి చేసినా వచ్చే రెండేళ్లలోనే చేయాలి.
This post was last modified on July 8, 2020 7:14 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…