రాజకీయాల్లోకి ఫుల్ టైం వెళ్ళిపోయాక ఇక మళ్ళీ సినిమాల వైపు చూడనని చెప్పిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకోవడానికి కారణం ఆర్థిక లెక్కలే. పవర్లో లేకుండా పార్టీని నడిపించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, సినిమాకు యాభై కోట్ల పారితోషికం ఇస్తామని అంటున్న నిర్మాతలు పవన్ ని ఇటు టెంప్ట్ చేసారు.
మళ్ళీ ఎన్నికల హంగామా మొదలవడానికి సమయం ఉంది కనుక ఈలోగా ఒక అరడజను సినిమాలు చేసి 300 కోట్లు సంపాదిస్తే తదుపరి ఎన్నికల వేళ ప్రచారానికి, సెక్యూరిటీ, మెయింటెనెన్సు తదితర ఖర్చులకు పనికొస్తుందని పవన్ భావించాడు. ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కానీ ఆ రెండు సినిమాలు పూర్తయి బయటకు రావడానికి వచ్చే ఏడాది కూడా గడచిపోయేట్టు ఉంది.
హరీష్ శంకర్ తో మైత్రి మూవీస్ సినిమా చేసిన తర్వాత ఇక పవన్ కి వేరే సినిమాలు చేసే తీరిక ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఎన్నికలకు లేట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈసారి ఆ తప్పు చేయకపోవచ్చు కనుక సినిమాల్లో ఏమి చేసినా వచ్చే రెండేళ్లలోనే చేయాలి.
This post was last modified on July 8, 2020 7:14 am
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…