తండ్రి మమ్ముట్టి మలయాళంలో పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ ఆయన చూపిన కమర్షియల్ బాట కాకుండా తనదంటూ ఓ విభిన్న శైలిని అలవరుచుకుని అద్భుత ఫలితాలను సాధిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఒకపక్క స్వంత భాషలో ఏడాదికో హిట్టు దక్కితే చాలని ఇప్పటి జెనరేషన్ హీరోలు కోరుకుంటే ఇతను మాత్రం నో లాంగ్వేజ్ బారియర్ అంటూ కథ నచ్చితే చాలు ఎంత రిస్క్ అయినా ఎంత దూరమైనా సరే రెడీ అంటున్నాడు. ఒకవేళ సదరు బాష రాకపోతే నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు తప్ప ఇంకొకరి గాత్రంలో తన పెర్ఫార్మన్స్ ని రిస్క్ లో పెట్టేందుకు సిద్ధపడటం లేదు.
ఇక విషయానికి వస్తే ఈ 2022లో దుల్కర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ప్యాన్ ఇండియా అంటూ ఒకే సినిమాతో కాకుండా నాలుగు వేర్వేరు భాషల్లో నటించి అందులోనూ హిట్లు సాధించి మిగిలినవాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ముందుగా తెలుగులో చూస్తే ‘సీతారామం’తో ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి ఏకంగా వంద కోట్ల గ్రాసర్ టాలీవుడ్ ఖాతాలో వేసేందుకు పరుగులు పెడుతున్నాడు. ఇటీవలే హిందీలో విడుదలైన ‘చుప్ రివెంజ్ అఫ్ ఆర్టిస్ట్’లో నటనకు విమర్శల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆశీర్వాదం కూడా దక్కినట్టు వసూళ్లు చెబుతున్నాయి.
మలయాళంలో చూస్తే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకున్న ‘సెల్యూట్’కి సోనీ లివ్ లో భారీ వ్యూయర్ షిప్ దక్కింది. అంతకు ముందు ‘కురుప్’ ఏ స్థాయిలో థియేట్రికల్ హిట్టో తెలిసిందే. తమిళంలో చేసిన ‘హే సినామిక’ అక్కడ పర్వాలేదనిపించుకుంది కానీ మరీ తన స్థాయిలో అయితే కాదు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా కాలాన్ని లెక్కేసుకుంటే కేవలం పదకొండు నెలల గ్యాప్ లో ఇన్ని సినిమాలు, మైలురాళ్ళు అందుకోవడం ఒక్క దుల్కర్ కే సాధ్యమయ్యింది. తన గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఒకటే. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో, కథల ఎంపిక ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు
This post was last modified on September 25, 2022 1:26 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…