తండ్రి మమ్ముట్టి మలయాళంలో పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ ఆయన చూపిన కమర్షియల్ బాట కాకుండా తనదంటూ ఓ విభిన్న శైలిని అలవరుచుకుని అద్భుత ఫలితాలను సాధిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఒకపక్క స్వంత భాషలో ఏడాదికో హిట్టు దక్కితే చాలని ఇప్పటి జెనరేషన్ హీరోలు కోరుకుంటే ఇతను మాత్రం నో లాంగ్వేజ్ బారియర్ అంటూ కథ నచ్చితే చాలు ఎంత రిస్క్ అయినా ఎంత దూరమైనా సరే రెడీ అంటున్నాడు. ఒకవేళ సదరు బాష రాకపోతే నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు తప్ప ఇంకొకరి గాత్రంలో తన పెర్ఫార్మన్స్ ని రిస్క్ లో పెట్టేందుకు సిద్ధపడటం లేదు.
ఇక విషయానికి వస్తే ఈ 2022లో దుల్కర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ప్యాన్ ఇండియా అంటూ ఒకే సినిమాతో కాకుండా నాలుగు వేర్వేరు భాషల్లో నటించి అందులోనూ హిట్లు సాధించి మిగిలినవాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ముందుగా తెలుగులో చూస్తే ‘సీతారామం’తో ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి ఏకంగా వంద కోట్ల గ్రాసర్ టాలీవుడ్ ఖాతాలో వేసేందుకు పరుగులు పెడుతున్నాడు. ఇటీవలే హిందీలో విడుదలైన ‘చుప్ రివెంజ్ అఫ్ ఆర్టిస్ట్’లో నటనకు విమర్శల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆశీర్వాదం కూడా దక్కినట్టు వసూళ్లు చెబుతున్నాయి.
మలయాళంలో చూస్తే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకున్న ‘సెల్యూట్’కి సోనీ లివ్ లో భారీ వ్యూయర్ షిప్ దక్కింది. అంతకు ముందు ‘కురుప్’ ఏ స్థాయిలో థియేట్రికల్ హిట్టో తెలిసిందే. తమిళంలో చేసిన ‘హే సినామిక’ అక్కడ పర్వాలేదనిపించుకుంది కానీ మరీ తన స్థాయిలో అయితే కాదు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా కాలాన్ని లెక్కేసుకుంటే కేవలం పదకొండు నెలల గ్యాప్ లో ఇన్ని సినిమాలు, మైలురాళ్ళు అందుకోవడం ఒక్క దుల్కర్ కే సాధ్యమయ్యింది. తన గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఒకటే. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో, కథల ఎంపిక ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు
This post was last modified on September 25, 2022 1:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…