మాములుగా ఎంతో కొంత ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ చేయడం మరీ కష్టమేమీ కాదు. ప్రొడ్యూసర్ బ్యాక్ అప్ ఉండి, కంటెంట్ మీద జనంలో కాస్తంత ఆసక్తి కలిగేలా చేస్తే చాలు ఏదోలా బిజినెస్ క్లోజ్ చేయొచ్చు. ఫలితం అటుఇటు అయినా డిజిటల్ ఆదాయం ఆదుకుని ఒడ్డున పడేస్తుంది. కాని సత్యదేవ్ కొత్త మూవీ మాత్రం విడుదలకు అష్టకష్టాలు పడుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నాతో మొదటిసారి జంట కట్టిన గుర్తుందా శీతాకాలం ట్రైలర్ ఆన్ లైన్లో వచ్చి ఏడు నెలలు దాటేసింది. మూడు మిలియన్లకు పైగా వ్యూస్ తో బాగానే హంగామా చేసింది.
కానీ పదే పదే పడుతున్న వాయిదాలు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. 2020లో వచ్చిన కన్నడ సూపర్ హిట్ లవ్ మాక్ టైల్ కి ఇది అఫీషియల్ రీమేక్. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్కూల్ నుంచి కాలేజీ దాకా జరిగిన సంఘటనల సమాహారంగా దీన్ని ఒక ఎమోషనల్ డ్రైవ్ గా ప్రెజెంట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ కి డార్లింగ్ కృష్ణ దర్శకత్వం వహించగా తెలుగుకి నాగశేఖర్ డైరెక్టర్. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఇలా గ్లామర్ కోషంట్ ని బాగానే సెట్ చేశారు. ఇటీవలే కార్తికేయ 2తో అదరగొట్టిన కాలభైరవ సంగీతం సమకూర్చడం మరో ఆకర్షణ.
నిజానికి ఈ 23 రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నారు కానీ ఇంకోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. కారణం ఏదైనా ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాంటి విపరీత భావోద్వేగాల ప్రేమకథలను థియేటర్లో చూసేందుకు జనం అంతగా ఇష్టపడటం లేదు. నాగచైతన్య థాంక్ యు తిరస్కారానికి గురయ్యింది అందుకే. సరే శీతాకాలం ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టుతో వస్తోంది కాబట్టి నమ్మొచ్చు కానీ అసలింతకీ బయటికి వస్తేగా. గాడ్సే డిజాస్టర్ తో సత్యదేవ్ కు సోలో హీరో మార్కెట్ ఇంకాస్త డౌన్ అయ్యింది. గాడ్ ఫాదర్ తర్వాత మళ్ళీ పికప్ అవుతాననే నమ్మకం కనిపిస్తోంది. మరి శీతాకాలం ఈ సంకెళ్లు ఎప్పుడు తెంచుకుంటుందో
This post was last modified on September 19, 2022 9:41 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…