మాములుగా ఏదైనా ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు జనాన్ని దశల వారిగా హెచ్చరిస్తూ ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలో చెబుతూ నెంబర్లతో వార్నింగ్ ఇస్తుంటారు. మూడో సంఖ్య అంటే పీక్స్ అన్నమాట. ఇక ప్రమాదం ముంచెత్తబోతోంది ప్రాణాలు కాపాడుకోమని. దీనికి హీరోయిన్ కృతి శెట్టికి లింక్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఉప్పెన డెబ్యూతోనే ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడికి తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు రూపంలో వరుస హిట్లు హ్యాట్రిక్ రూపంలో వరించాయి. దెబ్బకు డిమాండ్ మాములుగా పెరగలేదు.
దానికి తగ్గట్టే సహజంగానే రెమ్యునరేషన్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఎంత వేగంగా మూడు సక్సెస్ లు వచ్చాయో అంత కన్నా ఫాస్ట్ గా డిజాస్టర్లు తలుపు తడుతున్నాయి. రామ్ తో ఎగిరి గంతేసి చేసిన ది వారియర్ ఏ రేంజ్ డిజాస్టరో నిర్మాతని నిద్రలో లేపి అడిగినా చెబుతాడు. రెగ్యులర్ హీరోయిన్ ఫార్మట్ లో దర్శకుడు లింగుస్వామి తనకు చేసిన మేలేమీ లేదు. సరే అది పోతే పోయింది నితిన్ తో మసాలా బొమ్మ పడిందిగా అంటూ మాచర్ల నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకుంటే అదేమో రెండో వారం అడుగుపెట్టేలోపే థియేటర్ల నుంచి గుడ్ బై తీసుకుంది.
ఇప్పుడు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ లిస్టులో జాయినయ్యింది. నిజానికి పెర్ఫార్మన్స్ పరంగా ఇప్పటిదాకా దొరికినవాటిలో ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరికింది. కానీ దర్శకుడు ఇంద్రగంటి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవ్వడంతో ఫైనల్ గా ఇది కూడా ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతోంది. పబ్లిక్ టాక్ కానీ రివ్యూలు కానీ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇప్పుడు కృతి శెట్టి ఆశలన్నీ నాగచైతన్య-వెంకట్ ప్రభు, సూర్య-బాలా కాంబోలో రాబోయే సినిమాలే మీదే ఉన్నాయి. ఇవి తీస్తున్నది రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్లు కాకపోవడంతో పెద్ద బ్రేకే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
This post was last modified on September 17, 2022 10:25 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…