Political News

ఎమ్మెల్సీ క‌విత‌.. ఈడీ నోటీసులు.. ఖండ‌న‌!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందని మీడియా చానెళ్ల‌లో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్ర‌వారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. కాగా.. కవితకు కూడా ఈడీ నోటీసులు పంపించిందని.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. కీల‌క‌మైన మీడియా ఛానెళ్లు అన్నింటిలోనూ.. ఈ వార్త ప్ర‌ముఖంగా బ్రేకింగ్ న్యూస్ రూపంలో వ‌చ్చింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసిందని, ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందనేది మీడియా సంస్థ‌ల ప్ర‌చారం. అయితే.. ఈ విష‌యాన్ని క‌విత క్ష‌ణాల్లోనే ఖండించారు. మీడియాపై ఫైర‌య్యారు.

అస‌లు ఏం జ‌రిగింది?

హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా ఢిల్లీ, ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోనూ ఢిల్లీ లిక్క‌ర్ కుంబ‌కోణంతో సంబంధం ఉన్న వారిని కూడా వ‌దిలి పెట్ట‌లేదు. ఏపీ ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ నివాసముంటున్నారు.

నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. అలాగే.. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా.. గతంలోనూ ఎమ్మెల్సీ క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు ఈడీ నోటీసులు జారీ చేసింద‌నేది మీడియా వ‌ర్గాల ప్ర‌చారం.

క‌విత ఖండ‌న‌..

మ‌ద్యం కుంభకోణం వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చుని కొందరు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీడియా తమ సమయాన్ని నిజాలను చూపించేందుకు ఉపయోగించాలని కోరారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు. అయితే.. త‌న మాజీ అకౌంటెంట్ స‌హా స‌హాయ‌కుల ఇళ్ల‌లో ఈడీ సోదాల‌ను మాత్రం క‌విత ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

49 minutes ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

3 hours ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

3 hours ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

3 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

5 hours ago