తమిళ యువ కథానాయకుడు ధనుష్ లీడ్ రోల్ చేసిన 3 మూవీ గుర్తుందా? శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు అయింది. అప్పట్లో కొలవెరి పాట కారణంగా ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, పైగా ట్రాజిక్ ఎండ్ కావడంతో ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో 3 మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. తెలుగులో సినిమాకు భారీ నష్టాలు రావడంతో దీన్ని రిలీజ్ చేసిన నట్టి కుమార్ గొడవ గొడవ చేశాడు. ధనుష్తో పాటు నిర్మాతలు తనను పట్టించుకోలేదేని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడీ సినిమా గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అంటే.. ఈ నెల 12న 3 మూవీ పదో వార్షికోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో దీనికి స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో ధనుష్ పెద్ద స్టార్ కాబట్టి ఈ సినిమాకు అక్కడి జనాలు కనెక్ట్ అయి స్పెషల్ షోలు చూడడానికి ఆసక్తి చూపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగులో ధనుష్కు పెద్ద ఇమేజేమీ లేదు. రఘువరన్ బీటెక్ మినహాయిస్తే ఇక్కడ అతడి సినిమాలేవీ ఆడలేదు. గత కొన్నేళ్లలో అతడి క్రేజ్ మరింత తగ్గింది.
ఇలాంటి టైంలో 3 అనే డిజాస్టర్ మూవీకి స్పెషల్ షోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం.. వాటికి ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వస్తుండటం పెద్ద షాకే. హైదరాబాద్లో ఈ చిత్రానికి పదుల సంఖ్యలో షోలు వేస్తున్నారు. చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉండడం విశేషం. కొన్ని షోలు అయితే ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయాయి కూడా. పోకిరి, జల్సా లాంటి మన సూపర్ స్టార్ల సినిమాల కోసం ఎగబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. ఇక్కడ స్టార్ ఇమేజ్ లేని తమిళ హీరో నటించిన డిజాస్టర్ మూవీకి ఇంత క్రేజ్ ఏంటో ట్రేడ్ పండిట్లకు కూడా అంతుబట్టడం లేదు.
This post was last modified on September 8, 2022 7:14 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…