తమిళ యువ కథానాయకుడు ధనుష్ లీడ్ రోల్ చేసిన 3 మూవీ గుర్తుందా? శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు అయింది. అప్పట్లో కొలవెరి పాట కారణంగా ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, పైగా ట్రాజిక్ ఎండ్ కావడంతో ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో 3 మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. తెలుగులో సినిమాకు భారీ నష్టాలు రావడంతో దీన్ని రిలీజ్ చేసిన నట్టి కుమార్ గొడవ గొడవ చేశాడు. ధనుష్తో పాటు నిర్మాతలు తనను పట్టించుకోలేదేని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడీ సినిమా గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అంటే.. ఈ నెల 12న 3 మూవీ పదో వార్షికోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో దీనికి స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో ధనుష్ పెద్ద స్టార్ కాబట్టి ఈ సినిమాకు అక్కడి జనాలు కనెక్ట్ అయి స్పెషల్ షోలు చూడడానికి ఆసక్తి చూపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగులో ధనుష్కు పెద్ద ఇమేజేమీ లేదు. రఘువరన్ బీటెక్ మినహాయిస్తే ఇక్కడ అతడి సినిమాలేవీ ఆడలేదు. గత కొన్నేళ్లలో అతడి క్రేజ్ మరింత తగ్గింది.
ఇలాంటి టైంలో 3 అనే డిజాస్టర్ మూవీకి స్పెషల్ షోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం.. వాటికి ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వస్తుండటం పెద్ద షాకే. హైదరాబాద్లో ఈ చిత్రానికి పదుల సంఖ్యలో షోలు వేస్తున్నారు. చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉండడం విశేషం. కొన్ని షోలు అయితే ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయాయి కూడా. పోకిరి, జల్సా లాంటి మన సూపర్ స్టార్ల సినిమాల కోసం ఎగబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. ఇక్కడ స్టార్ ఇమేజ్ లేని తమిళ హీరో నటించిన డిజాస్టర్ మూవీకి ఇంత క్రేజ్ ఏంటో ట్రేడ్ పండిట్లకు కూడా అంతుబట్టడం లేదు.
This post was last modified on September 8, 2022 7:14 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…