తమిళ యువ కథానాయకుడు ధనుష్ లీడ్ రోల్ చేసిన 3 మూవీ గుర్తుందా? శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు అయింది. అప్పట్లో కొలవెరి పాట కారణంగా ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, పైగా ట్రాజిక్ ఎండ్ కావడంతో ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో 3 మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. తెలుగులో సినిమాకు భారీ నష్టాలు రావడంతో దీన్ని రిలీజ్ చేసిన నట్టి కుమార్ గొడవ గొడవ చేశాడు. ధనుష్తో పాటు నిర్మాతలు తనను పట్టించుకోలేదేని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడీ సినిమా గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అంటే.. ఈ నెల 12న 3 మూవీ పదో వార్షికోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో దీనికి స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో ధనుష్ పెద్ద స్టార్ కాబట్టి ఈ సినిమాకు అక్కడి జనాలు కనెక్ట్ అయి స్పెషల్ షోలు చూడడానికి ఆసక్తి చూపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగులో ధనుష్కు పెద్ద ఇమేజేమీ లేదు. రఘువరన్ బీటెక్ మినహాయిస్తే ఇక్కడ అతడి సినిమాలేవీ ఆడలేదు. గత కొన్నేళ్లలో అతడి క్రేజ్ మరింత తగ్గింది.
ఇలాంటి టైంలో 3 అనే డిజాస్టర్ మూవీకి స్పెషల్ షోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం.. వాటికి ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వస్తుండటం పెద్ద షాకే. హైదరాబాద్లో ఈ చిత్రానికి పదుల సంఖ్యలో షోలు వేస్తున్నారు. చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉండడం విశేషం. కొన్ని షోలు అయితే ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయాయి కూడా. పోకిరి, జల్సా లాంటి మన సూపర్ స్టార్ల సినిమాల కోసం ఎగబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. ఇక్కడ స్టార్ ఇమేజ్ లేని తమిళ హీరో నటించిన డిజాస్టర్ మూవీకి ఇంత క్రేజ్ ఏంటో ట్రేడ్ పండిట్లకు కూడా అంతుబట్టడం లేదు.
This post was last modified on September 8, 2022 7:14 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…