యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అతను వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నాడు. భీష్మ మినహాయిస్తే గత కొన్నేళ్లలో అతడికి సరైన విజయమే లేదు. ఆ సినిమా కూడా అన్ సీజన్లో రిలీజ్ కావడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేకపోయింది.
గత ఏడాది చెక్, రంగ్ దె చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న నితిన్.. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం రూపంలో పెద్ద డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ దెబ్బతో అతడి మార్కెట్ బాగా పడిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే తాను హీరోగా నటిస్తున్న చిత్రాలతో తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్న నితిన్కు ఈ మధ్య తన బేనర్ ద్వారా రిలీజ్ చేసిన ఓ డబ్బింగ్ సినిమా బాగా డబ్బులు తెచ్చి పెట్టింది. ఆ చిత్రమే.. విక్రమ్.
ఈ కమల్ హాసన్ మూవీని నితిన్ సొంత బేనర్ శ్రేష్ఠ్ మూవీసే రిలీజ్ చేసింది. సినిమా మీద పెట్టిన పెట్టుబడి మీద మూడింతల ఆదాయం తెచ్చిపెట్టింది విక్రమ్. ఈ సక్సెస్ నితిన్ సంస్థకు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు. కానీ అంతలోనే మాచర్ల నియోజకవర్గంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
కాగా విక్రమ్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా డబ్బింగ్ సినిమాలను తమ బేనర్ మీద రిలీజ్ చేయడానికి నితిన్ ఫ్యామిలీ డిసైడైంది. ఈ గురువారం రిలీజవుతున్న ఆర్య మూవీ కెప్టెన్ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది శ్రేష్ఠ్ మూవీసే. ఐతే దీనికి పెద్దగా బజ్ లేదు. విక్రమ్ లాగే రిలీజ్ తర్వాత ఇది అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. మరోవైపు గౌతమ్ మీనన్-శింబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన వెందు తనిందదు కాదు సినిమాను కూడా తెలుగులో నితిన్ సంస్థే రిలీజ్ చేయబోతోందట. ఈ చిత్రం సెప్టెంబరు 15కు షెడ్యూల్ అయింది. చూస్తుంటే నితిన్కు డబ్బింగ్ సినిమాలే మంచి ఆదాయ వనరుగా కనిపిస్తున్నట్లున్నాయి.
This post was last modified on September 7, 2022 6:53 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…