యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అతను వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నాడు. భీష్మ మినహాయిస్తే గత కొన్నేళ్లలో అతడికి సరైన విజయమే లేదు. ఆ సినిమా కూడా అన్ సీజన్లో రిలీజ్ కావడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేకపోయింది.
గత ఏడాది చెక్, రంగ్ దె చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న నితిన్.. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం రూపంలో పెద్ద డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ దెబ్బతో అతడి మార్కెట్ బాగా పడిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే తాను హీరోగా నటిస్తున్న చిత్రాలతో తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్న నితిన్కు ఈ మధ్య తన బేనర్ ద్వారా రిలీజ్ చేసిన ఓ డబ్బింగ్ సినిమా బాగా డబ్బులు తెచ్చి పెట్టింది. ఆ చిత్రమే.. విక్రమ్.
ఈ కమల్ హాసన్ మూవీని నితిన్ సొంత బేనర్ శ్రేష్ఠ్ మూవీసే రిలీజ్ చేసింది. సినిమా మీద పెట్టిన పెట్టుబడి మీద మూడింతల ఆదాయం తెచ్చిపెట్టింది విక్రమ్. ఈ సక్సెస్ నితిన్ సంస్థకు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు. కానీ అంతలోనే మాచర్ల నియోజకవర్గంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
కాగా విక్రమ్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా డబ్బింగ్ సినిమాలను తమ బేనర్ మీద రిలీజ్ చేయడానికి నితిన్ ఫ్యామిలీ డిసైడైంది. ఈ గురువారం రిలీజవుతున్న ఆర్య మూవీ కెప్టెన్ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది శ్రేష్ఠ్ మూవీసే. ఐతే దీనికి పెద్దగా బజ్ లేదు. విక్రమ్ లాగే రిలీజ్ తర్వాత ఇది అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. మరోవైపు గౌతమ్ మీనన్-శింబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన వెందు తనిందదు కాదు సినిమాను కూడా తెలుగులో నితిన్ సంస్థే రిలీజ్ చేయబోతోందట. ఈ చిత్రం సెప్టెంబరు 15కు షెడ్యూల్ అయింది. చూస్తుంటే నితిన్కు డబ్బింగ్ సినిమాలే మంచి ఆదాయ వనరుగా కనిపిస్తున్నట్లున్నాయి.
This post was last modified on September 7, 2022 6:53 pm
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…