మొన్న పాకిస్థాన్తో ఆసియా కప్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. ఆ టైంలో తమిళ హీరో విజయ్ విపరీతంగా ట్రోల్ అయ్యాడు సోషల్ మీడియాలో. అతణ్ని ట్రోల్ చేసింది తెలుగు నెటిజన్లే కావడం విశేషం. మరి ఇండియా మ్యాచ్ ఓడిపోతే విజయ్ను మన వాళ్లు ట్రోల్ చేయడమేంటి అని అడిగితే.. అందులో లాజిక్ ఏమీ లేదు. కొంత కాలంగా ఇలా ఒక కారణం అంటూ లేకుండా, సంబంధం లేని విషయాలకు ముడిపెట్టి మన నెటిజన్లు విజయ్ని టార్గెట్ చేస్తున్నారు.
ఐతే ఇందుకు ఒక రకంగా విజయ్ తమిళ అభిమానుల అతి కూడా ఒక కారణమే. వాళ్లు గతంలో కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు సహా కొందరు తెలుగు హీరోలను టార్గెట్ చేశారు. విజయ్ ముందు వాళ్లంతా వేస్ట్ అన్నట్లు మాట్లాడారు. ఐతే సోషల్ మీడియాలో సూపర్ స్ట్రాంగ్ అయిన మన హీరోల అభిమానులు ఊరుకుంటారా? రివర్స్ ఎటాక్తో విజయ్ అభిమానులకు దిమ్మదిరిగిపోయేలా చేశారు. అందులోనూ వీళ్లకు కావాల్సిన ట్రోల్ మెటీరియర్ విజయ్ చాలానే ఇచ్చాడు మరి.
విజయ్ తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేశాడు. కేవలం సినిమాలనే కాకుండా మన హీరోల పాటలు, డ్యాన్స్ మూమెంట్లు, ఫైట్లు.. ఇలా అన్నింటినీ వాడేశాడు. వాటిలో మన హీరోలతో పోలిస్తే విజయ్ తేలిపోయాడన్నది వాస్తవం. ‘పోకిరి’, ‘ఛత్రపతి’ లాంటి చిత్రాల్లో మహేష్, ప్రభాస్ల స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్తో పోలిస్తే విజయ్ అన్ని రకాలుగా తుస్సుమనిపించాడు. ఇవే కాక విజయ్ సినిమాల్లో చాలా సీన్లు మరీ అతిగా, నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. అతను మరీ విడ్డూరమైన ఫీట్లు చేశాడు చాలా సినిమాల్లో. మరి ఇలాంటి కంటెంట్ దొరికితే మన వాళ్లు ఊరుకుంటారా? అతణ్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ మీమ్ ఫెస్టివల్ చేస్తున్నారు.
గతంలో చేసిన అతికి బదులు అన్నట్లుగా.. సంబంధం లేని కారణాలతో అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. మొన్న ఇండియా మ్యాచ్ ఓడిపోయాక విజయ్ని మన నెటిజన్లు ట్రోల్ చేశారని.. అతడి ఫ్యాన్స్ మహేష్ బాబును కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీంతో మహేష్ అభిమానులు ఇంకా రెచ్చిపోయి విజయ్ని ట్రోల్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ వేర్వేరు హీరోల అభిమానుల మధ్య వైరం ఉంది కానీ.. విజయ్ని ట్రోల్ చేసే విషయానికి వచ్చేసరికి అందరూ ఒక్కటైపోతున్నారు. అందుకే ‘నేషనల్ ట్రోల్ మెటీరియల్ విజయ్’ సహా కొన్ని అబ్యూజివ్ హ్యాష్ ట్యాగ్స్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి రెండు రోజులుగా.
This post was last modified on September 6, 2022 2:16 pm
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…