సున్నితమైన కథలతో హృద్యంగా సినిమాలు తీస్తారని పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య కాస్త రూటు మారుద్దామని వయొలెంట్ గా తీసిన రివెంజ్ డ్రామా V కి ఆశించిన పేరు రాకపోవడంతో తిరిగి తన పాత స్కూల్ కే వచ్చేశారు. దీంతో పాటు సుధీర్ బాబుతో గతంలో సమ్మోహనం లాంటి ఫీల్ గుడ్ మూవీ ఇచ్చిన ఈ ఇద్దరూ మరోసారి చేతులు కలిపారు. ఈసారి టైటిల్ రోల్ లో కృతి శెట్టిని తీసుకొచ్చారు. ఇందాక మహేష్ బాబు ద్వారా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
మాములుగా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని ఇంటర్వ్యూలలో చెప్పడం మనం చాలా సార్లు చూశాం. ఇంద్రగంటి సరిగ్గా ఇదే పాయింట్ ని తీసుకుని కథను అల్లేశారు. డాక్టర్ అలేఖ్య(కృతి శెట్టి)ఓ బుట్టబొమ్మ లాంటి అందమైన అమ్మాయి. ఆమెను ఎలాగైనా ఇండస్ట్రీకి తీసుకురావాలని కంకణం కట్టుకుంటాడో యువకుడు(సుధీర్ బాబు). అయితే ఆమె తల్లితండ్రులకు సినిమాలంటేనే అసహ్యం. ఎంతగా అంటే కూతురు తెరమీద కనిపిస్తే శవాలవుతామని బెదిరించేంత. మరి మూడీ మనస్తత్వానికి మారుపేరైన అలేఖ్యను ఆ కుర్రాడు ఎలా అడుగుపెట్టించాడు అనేదే కథగా ఓపెన్ చేశారు.
మొత్తానికి ట్రైలర్ ఇంటరెస్టింగ్ గానే ఉంది. వంశీ సితార, దాసరి శివరంజని తాలూకు షేడ్స్ కొన్ని కనిపిస్తున్నప్పటికీ ఇప్పటి జనరేషన్ కు సింక్ అయ్యే టేకింగ్ తో ఇంద్రగంటి ఏదో కొత్తగానే ట్రై చేశారు. సాధారణంగా పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో రూపొందే చిత్రాలకు సక్సెస్ రేట్ తక్కువ. కొన్ని మాత్రమే విజయం సాధించాయి. వరస హిట్ల తర్వాత కృతిశెట్టికి ఇటీవలే రెండు ఫ్లాపులు క్యూ కట్టాయి. ఇప్పుడు కథ మొత్తం తన చుట్టే తిరిగే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. మరి ఈ అమ్మాయి ప్రేక్షకులకు నచ్చేస్తే తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడినట్టే. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ కూల్ ఎంటర్ టైనర్ 16న విడుదల కానుంది.
This post was last modified on September 5, 2022 9:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖలు చేసిన అంబటి రాంబాబును, గుంటూరులోని తన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…