కరోనా లాక్ డౌన్ అయ్యాక దేశంలో వెబ్ సిరీస్ లకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు వీటిని వెబ్ లో వచ్చే టీవీ సీరియల్స్ గా భావించే వాళ్ళు క్రమంగా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమాలను తలదన్నేలా కోట్ల రూపాయల బడ్జెట్ తో కుర్చీ బిగువున కూర్చుని చూసే క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాలతో మెప్పిస్తున్న తీరు గురించి చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథమే అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992, తబ్బర్ లాంటివెన్నో ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 భారీ స్పందన దక్కించుకుంది.
ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సీజన్ 1 బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ కావడంతో దీనికి చాలా పేరు వచ్చింది. రెండో సీజన్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు ప్రేక్షకులముందుకొచ్చింది. 1990 ప్రాంతంలో కచ్చా బనియన్ అనే గ్యాంగ్ అతి దారుణంగా పౌరులను చంపుతూ దొంగతనాలు లూటీలు చేసేది.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహాలో ఒంటరిగా ఉన్న ధనవంతులైన వృద్ధులు హత్యకు గురవుతారు. ఈ కేసుని తీసుకున్న డిసిపి వర్తికా చతుర్వేది(షఫాలీ షా)కు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతాయి. చివరికి హంతకులను పట్టుకోవడమే స్టోరీ. ఎక్స్ పోలీస్ ఆఫీసర్ నీరజ్ కుమార్ రాసిన ఖాకీ ఫైల్స్ ఆధారంగా దర్శకుడు తనూజ్ చోప్రా ఢిల్లీ క్రైమ్ 2ని తెరకెక్కించారు.
మొదటి భాగంలో ఉన్నంత డెప్త్ ఇందులో లేకపోయినా ఓవరాల్ గా కాస్త ఓపికతో చూస్తే పాస్ అయ్యేలాగే సిరీస్ సాగింది. సిబ్బంది కొరత వల్ల డిపార్ట్ మెంట్ లో అంతర్గతంగా ఎదురుకుంటున్న సమస్యలను ఒకవైపు ఎత్తి చూపిస్తూనే వెనుకబడిన వర్గాలను ట్రీట్ చేసే విధానాన్ని చూపించిన విధానం బాగుంది. ఎక్కువ థ్రిల్స్, ట్విస్టులు ఆశించకుండా చూస్తే సరిపడా మలుపులతో ఫైనల్ గా ఢిల్లీ క్రైమ్ 2 పాస్ అయ్యే రేంజ్ లో సాగింది. కాకపోతే అంచనాలను పరిమితంగా పెట్టుకుంటేనే సుమా.
This post was last modified on September 2, 2022 12:08 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…