బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన అమీర్ ఖాన్.. లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడతను. ఐతే ఇటీవల తన కెరీర్లో ఎన్నడూ ఎరుగని ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడతను గత నెల 11న విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
నిజానికి ఈ సినిమా ఫలితమేంటో విడుదలకు ముందే దాదాపుగా నిర్ణయం అయిపోయిందని చెప్పాలి. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేదు. దీనికి తోడు రకరకాల కారణాల వల్ల ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సోషల్ మీడియాలో. ఆ ప్రభావం సినిమా మీద గట్టిగానే పడిందన్నది స్పష్టం. మొత్తానికి ఆమిర్ గత సినిమాలు తొలి రోజు సాధించే వసూళ్లను ఈ సినిమా ఫుల్ రన్లో రాబట్టగలిగిందంతే. ఈ ఫలితం ఆమిర్కు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.
సినిమా కోసం ఎంతో తపించే ఆమిర్కు ప్రేక్షకులకు ఇలాంటి శిక్ష వేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఐతే తన సినిమాను నిరాదరించినందుకు ఆమిర్ ఏమీ ప్రేక్షకుల మీద కోపం, అసహనం చూపించట్లేదు. వారి అంచనాలకు తగ్గ సినిమా తీయనందుకు పరోక్షంగా తనే సారీ చెప్పాడు. తాజాగా ఆమిర్ నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది. షారుఖ్ ఖాన్ సినిమా కల్ హో న హోలోని మాటలను గుర్తు చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పింది. మనందరం మనుషులమే. కాబట్టి అందరం తప్పులు చేస్తాం.
కొన్నిసార్లు మన మాటలు తప్పవుతాయి. కొన్నిసార్లు చేతలు తప్పవుతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు మనం కోపంతో ఎదుటివాళ్లను బాధ పెడతాం. కొన్నిసార్లు తమషా చేస్తూ, కొన్నిసార్లు మన మౌనంతో ఇతరులను బాధ పెడతాం. నేను కనుగ మనోభావాలను దెబ్బ తీసి ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నా.. ఇదీ ఈ పోస్టు సారాంశం. తన సినిమా పోయిన బాధను పక్కన పెట్టి ప్రేక్షకులకు సారీ చెప్పడం ఆమిర్కే చెల్లింది.
This post was last modified on September 2, 2022 8:14 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…