బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన అమీర్ ఖాన్.. లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడతను. ఐతే ఇటీవల తన కెరీర్లో ఎన్నడూ ఎరుగని ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడతను గత నెల 11న విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
నిజానికి ఈ సినిమా ఫలితమేంటో విడుదలకు ముందే దాదాపుగా నిర్ణయం అయిపోయిందని చెప్పాలి. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేదు. దీనికి తోడు రకరకాల కారణాల వల్ల ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సోషల్ మీడియాలో. ఆ ప్రభావం సినిమా మీద గట్టిగానే పడిందన్నది స్పష్టం. మొత్తానికి ఆమిర్ గత సినిమాలు తొలి రోజు సాధించే వసూళ్లను ఈ సినిమా ఫుల్ రన్లో రాబట్టగలిగిందంతే. ఈ ఫలితం ఆమిర్కు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.
సినిమా కోసం ఎంతో తపించే ఆమిర్కు ప్రేక్షకులకు ఇలాంటి శిక్ష వేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఐతే తన సినిమాను నిరాదరించినందుకు ఆమిర్ ఏమీ ప్రేక్షకుల మీద కోపం, అసహనం చూపించట్లేదు. వారి అంచనాలకు తగ్గ సినిమా తీయనందుకు పరోక్షంగా తనే సారీ చెప్పాడు. తాజాగా ఆమిర్ నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది. షారుఖ్ ఖాన్ సినిమా కల్ హో న హోలోని మాటలను గుర్తు చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పింది. మనందరం మనుషులమే. కాబట్టి అందరం తప్పులు చేస్తాం.
కొన్నిసార్లు మన మాటలు తప్పవుతాయి. కొన్నిసార్లు చేతలు తప్పవుతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు మనం కోపంతో ఎదుటివాళ్లను బాధ పెడతాం. కొన్నిసార్లు తమషా చేస్తూ, కొన్నిసార్లు మన మౌనంతో ఇతరులను బాధ పెడతాం. నేను కనుగ మనోభావాలను దెబ్బ తీసి ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నా.. ఇదీ ఈ పోస్టు సారాంశం. తన సినిమా పోయిన బాధను పక్కన పెట్టి ప్రేక్షకులకు సారీ చెప్పడం ఆమిర్కే చెల్లింది.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…