బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన అమీర్ ఖాన్.. లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడతను. ఐతే ఇటీవల తన కెరీర్లో ఎన్నడూ ఎరుగని ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడతను గత నెల 11న విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
నిజానికి ఈ సినిమా ఫలితమేంటో విడుదలకు ముందే దాదాపుగా నిర్ణయం అయిపోయిందని చెప్పాలి. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేదు. దీనికి తోడు రకరకాల కారణాల వల్ల ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సోషల్ మీడియాలో. ఆ ప్రభావం సినిమా మీద గట్టిగానే పడిందన్నది స్పష్టం. మొత్తానికి ఆమిర్ గత సినిమాలు తొలి రోజు సాధించే వసూళ్లను ఈ సినిమా ఫుల్ రన్లో రాబట్టగలిగిందంతే. ఈ ఫలితం ఆమిర్కు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.
సినిమా కోసం ఎంతో తపించే ఆమిర్కు ప్రేక్షకులకు ఇలాంటి శిక్ష వేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఐతే తన సినిమాను నిరాదరించినందుకు ఆమిర్ ఏమీ ప్రేక్షకుల మీద కోపం, అసహనం చూపించట్లేదు. వారి అంచనాలకు తగ్గ సినిమా తీయనందుకు పరోక్షంగా తనే సారీ చెప్పాడు. తాజాగా ఆమిర్ నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది. షారుఖ్ ఖాన్ సినిమా కల్ హో న హోలోని మాటలను గుర్తు చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పింది. మనందరం మనుషులమే. కాబట్టి అందరం తప్పులు చేస్తాం.
కొన్నిసార్లు మన మాటలు తప్పవుతాయి. కొన్నిసార్లు చేతలు తప్పవుతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు మనం కోపంతో ఎదుటివాళ్లను బాధ పెడతాం. కొన్నిసార్లు తమషా చేస్తూ, కొన్నిసార్లు మన మౌనంతో ఇతరులను బాధ పెడతాం. నేను కనుగ మనోభావాలను దెబ్బ తీసి ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నా.. ఇదీ ఈ పోస్టు సారాంశం. తన సినిమా పోయిన బాధను పక్కన పెట్టి ప్రేక్షకులకు సారీ చెప్పడం ఆమిర్కే చెల్లింది.
This post was last modified on September 2, 2022 8:14 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…