ఒకప్పట్లా మూడు గంటల నిడివితో ఎక్కువగా సినిమాలు రావట్లేదు. గతంలో నిడివి అనేది సమస్యగానే ఉండేది కాదు. మూడు గంటలకు అటు ఇటు నిడివితో చాలా సినిమాలే వచ్చేవి. కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఓపిక తక్కువ. ఏ మాత్రం నిడివి ఎక్కువైనా, సినిమా సాగతీతగా అనిపించినా ‘ల్యాగ్’ అంటూ పెదవి విరిచేస్తున్నారు. నిజానికి సినిమా బాగుంటే ఎప్పుడూ కూడా లెంగ్త్ అనేది సమస్యే కాదు. కానీ సినిమా అటు ఇటుగా ఉంటే మాత్రం నిడివి అనేది ప్రస్తుతం చాలా పెద్ద సమస్య అయి కూర్చుంటోంది.
అసలే బాలేని సినిమాను అంత ఎక్కువ నిడివితో చూడాల్సి రావడం ప్రేక్షకులకు నరకమే అని చెప్పాలి. ఇప్పుడు విక్రమ్ సినిమా ‘కోబ్రా’ ఆడియన్స్కు అలాంటి అనుభవమే మిగిల్చింది. ఈ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు కావడం గమనార్హం. ఈ రన్ టైం చూసి విడుదలకు ముందే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ఇంత నిడివితో ఫైనల్ కట్ ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇది చాలా రిస్కీ వ్యవహారంలా కనిపించింది.
‘కోబ్రా’ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడమే కాదు.. ప్రేక్షకులకు ఒక రకంగా టార్చర్ చూపించిందనే చెప్పాలి. దర్శకులు అసలేం రాసుకున్నాడో, ఏం తీశాడో అర్థం కాని విధంగా సినిమా తయారైంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర అసలేమాత్రం కసరత్తు జరగలేదని.. తీసిందంతా అలాగే పెట్టి థియేటర్లకు వదిలేశారని అనిపించింది. అసలే సినిమా అంతంతమాత్రం అంటే.. విపరీతమైన సాగతీతగా అనిపించే హీరో ఫ్లాష్ బ్యాక్, అతడి ఊహా ప్రపంచం చుట్టూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులకు చుక్కలు చూపించేశాయి.
ఐతే తొలి రోజు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక ‘కోబ్రా’ టీం మేల్కొంది. సినిమా నిడివి ఎక్కువైందన్న కంప్లైంట్లను తాము ఆలకించామని.. సమీక్షకులు, ప్రేక్షకుల అభిప్రాయాన్ని అనుసరించి 20 నిమిషాల నిడివి తగ్గిస్తున్నామని ప్రకటించారు. కానీ ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. సినిమా రష్ చూసిన ఎవరైనా నిడివి చాలా ఎక్కువైందనే ఫీలై ఉంటారు. అప్పుడే కొంచెం జాగ్రత్త పడి లెంగ్త్ తగ్గించి ఉంటే సినిమాకు ఈ స్థాయిలో నెగెటివ్ టాక్ వచ్చేది కాదు. ఈ టాక్ తర్వాత ఏం చేసినా సినిమాను కాపాడ్డం కష్టంగానే కనిపిస్తోంది.
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…