మూడు నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తూ చాలా సెలెక్టివ్ గా ఉంటున్న అమీర్ ఖాన్ కు ఇటీవలే లాల్ సింగ్ చడ్డా ఇచ్చిన డిజాస్టర్ షాక్ మామూలుది కాదు. ఏకంగా వంద కోట్లకు పైగా నష్టాలతో కొన్న ప్రతి ఒక్కరిని నిలువునా ముంచేసింది. ఉన్నది దాచుకున్నది రెండూ పోయాయనే సామెత తరహాలో రిలీజ్ కు ముందు ఓటిటి రూపంలో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని తిరస్కరించినందుకు ఎంత బాధపడుతున్నాడో వేరే చెప్పనక్కర్లేదు. ఇన్నేళ్లకు బాలీవుడ్ డెబ్యూ చేసిన నాగ చైతన్యకు సైతం ఇది చేదు అనుభవంగా మిగలడం మరో ట్రాజెడీ.
సరే లాల్ సింగ్ కథ ముగిసిపోయింది కదా ఇక దగ్గరలో అమీర్ ఖాన్ చూసే ఛాన్స్ లేదంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తను మరో రెండు ప్రాజెక్టులలో ఆల్రెడీ భాగమయ్యాడు. ధోభీ ఘాట్ తర్వాత అతని మాజీ భార్య మరోసారి దర్శకత్వం చేస్తున్న 2 బ్రైడ్స్ లో అమీర్ ఒక ప్రత్యేక క్యామియో చేస్తున్నాడు. ఎంత నిడివనేది బయటికి చెప్పలేదు కానీ చెప్పుకోదగ్గ ప్రాధాన్యం అయితే ఉంటుందట. కొడుకు జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ప్రీతమ్ ప్యారే వెబ్ సిరీస్ లోనూ అమీర్ ఖాన్ కనిపిస్తాడు. దీనికి హోమ్ బ్యానర్ ద్వారా స్వంత పెట్టుబడే పెడుతున్నాడు.
ఇప్పుడు వీటికీ బాయ్ కాట్ భయాలు చుట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఇవేవి పని చేయవు కానీ సోషల్ మీడియా ప్రభావం అమీర్ మూవీస్ మీద ఎంత బలంగా ఉంటుందో నిర్మాతలకు అర్థమవుతోంది. లాల్ సింగ్ దెబ్బకే ఇప్పట్లో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకూడదని అతను నిర్ణయించుకున్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి కానీ అవెంత నిజమో కొంత కాలమయ్యాకే తెలుస్తుంది. ఎప్పుడో అన్న మాటలను పట్టుకుని తనకింత నష్టం కలిగిస్తున్న ధోరణిపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని అయోమయంలో ఉన్న అమీర్ రిలీజ్ అయినప్పటి నుంచి బయట మళ్ళీ కనిపిస్తే ఒట్టు.
This post was last modified on August 31, 2022 11:09 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…