మూడు నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తూ చాలా సెలెక్టివ్ గా ఉంటున్న అమీర్ ఖాన్ కు ఇటీవలే లాల్ సింగ్ చడ్డా ఇచ్చిన డిజాస్టర్ షాక్ మామూలుది కాదు. ఏకంగా వంద కోట్లకు పైగా నష్టాలతో కొన్న ప్రతి ఒక్కరిని నిలువునా ముంచేసింది. ఉన్నది దాచుకున్నది రెండూ పోయాయనే సామెత తరహాలో రిలీజ్ కు ముందు ఓటిటి రూపంలో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని తిరస్కరించినందుకు ఎంత బాధపడుతున్నాడో వేరే చెప్పనక్కర్లేదు. ఇన్నేళ్లకు బాలీవుడ్ డెబ్యూ చేసిన నాగ చైతన్యకు సైతం ఇది చేదు అనుభవంగా మిగలడం మరో ట్రాజెడీ.
సరే లాల్ సింగ్ కథ ముగిసిపోయింది కదా ఇక దగ్గరలో అమీర్ ఖాన్ చూసే ఛాన్స్ లేదంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తను మరో రెండు ప్రాజెక్టులలో ఆల్రెడీ భాగమయ్యాడు. ధోభీ ఘాట్ తర్వాత అతని మాజీ భార్య మరోసారి దర్శకత్వం చేస్తున్న 2 బ్రైడ్స్ లో అమీర్ ఒక ప్రత్యేక క్యామియో చేస్తున్నాడు. ఎంత నిడివనేది బయటికి చెప్పలేదు కానీ చెప్పుకోదగ్గ ప్రాధాన్యం అయితే ఉంటుందట. కొడుకు జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ప్రీతమ్ ప్యారే వెబ్ సిరీస్ లోనూ అమీర్ ఖాన్ కనిపిస్తాడు. దీనికి హోమ్ బ్యానర్ ద్వారా స్వంత పెట్టుబడే పెడుతున్నాడు.
ఇప్పుడు వీటికీ బాయ్ కాట్ భయాలు చుట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే ఇవేవి పని చేయవు కానీ సోషల్ మీడియా ప్రభావం అమీర్ మూవీస్ మీద ఎంత బలంగా ఉంటుందో నిర్మాతలకు అర్థమవుతోంది. లాల్ సింగ్ దెబ్బకే ఇప్పట్లో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకూడదని అతను నిర్ణయించుకున్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి కానీ అవెంత నిజమో కొంత కాలమయ్యాకే తెలుస్తుంది. ఎప్పుడో అన్న మాటలను పట్టుకుని తనకింత నష్టం కలిగిస్తున్న ధోరణిపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని అయోమయంలో ఉన్న అమీర్ రిలీజ్ అయినప్పటి నుంచి బయట మళ్ళీ కనిపిస్తే ఒట్టు.
This post was last modified on August 31, 2022 11:09 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…