‘మళ్ళీ రావా’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇది చిన్న సినిమా అయినప్పటికీ.. ఒక క్లాసిక్ అన్న పేరు తెచ్చుకోవడం, ప్రేక్షకాదరణ పొందడంతో నాని లాంటి స్టార్తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ‘జెర్సీ’ లాంటి ఇంకో క్లాసిక్ను డెలివర్ చేశాడు. తెలుగులో ఇదే బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అనడంలో మరో మాట లేదు. ఈ సినిమాతో గౌతమ్కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
పెద్ద బడ్జెట్, స్టార్ హీరో ఉంటే అతను అద్భుతాలు చేయగలడు అన్న భరోసా ఇండస్ట్రీ జనాల్లో కలిగింది. అదే సమయంలో అతడికి హిందీలో ‘జెర్సీ’ని రీమేక్ చేేసే అవకాశం వస్తే అటు వెళ్లాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం విడుదలకు ముందు స్యూర్ షాట్ బ్లాక్బస్టర్ అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
‘జెర్సీ’ హిందీ రీమేక్ చర్చల్లో ఉండగానే రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్తో సినిమా కోసం గౌతమ్కు డిస్కషన్లు నడిచాయి. తర్వాత ఈ సినిమా ఓకే కూడా అయింది. ఆ తర్వాతే అతను ‘జెర్సీ’ హిందీ వెర్షన్ పూర్తి చేశాడు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్లలో కూడా చరణ్తో తన సినిమా గురించి కన్ఫమ్ చేశాడు గౌతమ్. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇదేమీ ఉత్తుత్తి ప్రచారం కాదని.. నిజంగానే ఈ సినిమా వర్కవుట్ కావట్లేదని చరణ్ సన్నిహిత వర్గాలు అంటుున్నాయి. ఈ సినిమా రద్దవడం పట్ల గౌతమ్ చాలా ఫీలవుతున్నట్లు సమాచారం.
దీనికి పరోక్షంగా ‘జెర్సీ’ రీమేకే కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఇమేజ్ పెరిగిపోవడం, ఇకపై అతను భారీ సెటప్తోనే సినిమాలు చేసే అవకాశాలుండడం.. భారీతనం, మాస్, యాక్షన్ అంశాలు ఉండి వాటిని బాగా డీల్ చేసే దర్శకులతోనే జట్టు కట్టాలని నిర్ణయించుకోవడంతో గౌతమ్కు ఛాన్స్ మిస్సయినట్లు తెలుస్తోంది. అతడి కథ కొంచెం క్లాస్ టచ్ ఉన్నది కావడం, అందులోనూ ‘జెర్సీ’ రీమేక్తో అతను ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో చరణ్ వెనక్కి తగ్గాడని అంటున్నారు.
This post was last modified on August 30, 2022 7:10 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…