‘మళ్ళీ రావా’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇది చిన్న సినిమా అయినప్పటికీ.. ఒక క్లాసిక్ అన్న పేరు తెచ్చుకోవడం, ప్రేక్షకాదరణ పొందడంతో నాని లాంటి స్టార్తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ‘జెర్సీ’ లాంటి ఇంకో క్లాసిక్ను డెలివర్ చేశాడు. తెలుగులో ఇదే బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అనడంలో మరో మాట లేదు. ఈ సినిమాతో గౌతమ్కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
పెద్ద బడ్జెట్, స్టార్ హీరో ఉంటే అతను అద్భుతాలు చేయగలడు అన్న భరోసా ఇండస్ట్రీ జనాల్లో కలిగింది. అదే సమయంలో అతడికి హిందీలో ‘జెర్సీ’ని రీమేక్ చేేసే అవకాశం వస్తే అటు వెళ్లాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం విడుదలకు ముందు స్యూర్ షాట్ బ్లాక్బస్టర్ అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
‘జెర్సీ’ హిందీ రీమేక్ చర్చల్లో ఉండగానే రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్తో సినిమా కోసం గౌతమ్కు డిస్కషన్లు నడిచాయి. తర్వాత ఈ సినిమా ఓకే కూడా అయింది. ఆ తర్వాతే అతను ‘జెర్సీ’ హిందీ వెర్షన్ పూర్తి చేశాడు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్లలో కూడా చరణ్తో తన సినిమా గురించి కన్ఫమ్ చేశాడు గౌతమ్. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇదేమీ ఉత్తుత్తి ప్రచారం కాదని.. నిజంగానే ఈ సినిమా వర్కవుట్ కావట్లేదని చరణ్ సన్నిహిత వర్గాలు అంటుున్నాయి. ఈ సినిమా రద్దవడం పట్ల గౌతమ్ చాలా ఫీలవుతున్నట్లు సమాచారం.
దీనికి పరోక్షంగా ‘జెర్సీ’ రీమేకే కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఇమేజ్ పెరిగిపోవడం, ఇకపై అతను భారీ సెటప్తోనే సినిమాలు చేసే అవకాశాలుండడం.. భారీతనం, మాస్, యాక్షన్ అంశాలు ఉండి వాటిని బాగా డీల్ చేసే దర్శకులతోనే జట్టు కట్టాలని నిర్ణయించుకోవడంతో గౌతమ్కు ఛాన్స్ మిస్సయినట్లు తెలుస్తోంది. అతడి కథ కొంచెం క్లాస్ టచ్ ఉన్నది కావడం, అందులోనూ ‘జెర్సీ’ రీమేక్తో అతను ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో చరణ్ వెనక్కి తగ్గాడని అంటున్నారు.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…