పుష్ప, కార్తికేయ-2 లాంటి చిత్రాలకు ఉత్తరాదిన ప్రమోషన్ల పరంగా ఏ హడావుడి లేదు. వాటికి రిలీజ్ ప్లానింగ్ సైతం సరిగా జరగలేదు. ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేస్తున్నట్లే కనిపించింది. కానీ ఆ చిత్రాలు మౌత్ టాక్తో జనాలను థియేటర్లకు రప్పించాయి. ఊహించిన విజయం సాధించాయి. ఐతే విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల లైగర్ మూవీని ముందు నుంచి ఒక ప్రాపర్ హిందీ సినిమాలాగే తీర్చిదిద్దారు.
ప్రమోషన్ కూడా ఉత్తరాదిన గట్టిగా చేశారు. అయినా సరే.. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఆశాజనకంగా అనిపించలేదు. ఉత్తరాది పెద్ద నగరాలు వేటిలోనూ థియేటర్లు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి టాక్ రావడం కీలకంగా మారింది. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసిన సినిమా కాబట్టి మంచి టాక్ వచ్చి ఉంటే సినిమా రేంజి వేరుగా ఉండేదేమో. కానీ అది జరగలేదు.
ఇటు తెలుగులోనే కాక అటు హిందీలోనూ లైగర్కు పూర్తి నెగెఇవ్ రివ్యూలే వచ్చాయి. హిందీ క్రిటిక్స్ అయితే 1, 1.5 రేటింగ్స్ ఇచ్చారు ఈ సినిమాకు. మౌత్ టాక్ కూడా ఏమీ బాగా లేదు. ఈ నేపథ్యంలో హిందీలో లైగర్ ముద్ర వేయడం కష్టమే అనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు పర్వాలేదు కానీ.. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి, చేసిన హడావుడికి తగ్గట్లయితే ఓపెనింగ్స్ లేవు.ఈ టాక్తో సినిమా ముందుకు సాగడం కష్టమే అనిపిస్తోంది.
లైగర్ హిందీ హక్కులను రూ.12 కోట్లకు అమ్మారు. అక్కడ గ్రాస్లో సగానికి సగం మాత్రమే షేర్ రూపంలో వస్తుంది. అంటే లైగర్ రూ.20 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేయాలి. కానీ తొలి రోజు అందులో 15 శాతం మాత్రమే రికవరీ జరిగింది. టాక్ బాలేకపోవడంతో వీకెండ్ మీద ఆశలు తక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత అయితే సినిమా నిలబడడం చాలా కష్టం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయ్ పాన్ ఇండియా సక్సెస్ ఆశలు గల్లంతయినట్లే. లైగర్ వల్ల ఇండియా షేక్ అవడం కాదు.. ఈ సినిమాను నమ్ముకున్న వాళ్లే షేక్ అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on August 27, 2022 9:02 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…