పుష్ప, కార్తికేయ-2 లాంటి చిత్రాలకు ఉత్తరాదిన ప్రమోషన్ల పరంగా ఏ హడావుడి లేదు. వాటికి రిలీజ్ ప్లానింగ్ సైతం సరిగా జరగలేదు. ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేస్తున్నట్లే కనిపించింది. కానీ ఆ చిత్రాలు మౌత్ టాక్తో జనాలను థియేటర్లకు రప్పించాయి. ఊహించిన విజయం సాధించాయి. ఐతే విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల లైగర్ మూవీని ముందు నుంచి ఒక ప్రాపర్ హిందీ సినిమాలాగే తీర్చిదిద్దారు.
ప్రమోషన్ కూడా ఉత్తరాదిన గట్టిగా చేశారు. అయినా సరే.. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఆశాజనకంగా అనిపించలేదు. ఉత్తరాది పెద్ద నగరాలు వేటిలోనూ థియేటర్లు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి టాక్ రావడం కీలకంగా మారింది. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసిన సినిమా కాబట్టి మంచి టాక్ వచ్చి ఉంటే సినిమా రేంజి వేరుగా ఉండేదేమో. కానీ అది జరగలేదు.
ఇటు తెలుగులోనే కాక అటు హిందీలోనూ లైగర్కు పూర్తి నెగెఇవ్ రివ్యూలే వచ్చాయి. హిందీ క్రిటిక్స్ అయితే 1, 1.5 రేటింగ్స్ ఇచ్చారు ఈ సినిమాకు. మౌత్ టాక్ కూడా ఏమీ బాగా లేదు. ఈ నేపథ్యంలో హిందీలో లైగర్ ముద్ర వేయడం కష్టమే అనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు పర్వాలేదు కానీ.. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి, చేసిన హడావుడికి తగ్గట్లయితే ఓపెనింగ్స్ లేవు.ఈ టాక్తో సినిమా ముందుకు సాగడం కష్టమే అనిపిస్తోంది.
లైగర్ హిందీ హక్కులను రూ.12 కోట్లకు అమ్మారు. అక్కడ గ్రాస్లో సగానికి సగం మాత్రమే షేర్ రూపంలో వస్తుంది. అంటే లైగర్ రూ.20 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేయాలి. కానీ తొలి రోజు అందులో 15 శాతం మాత్రమే రికవరీ జరిగింది. టాక్ బాలేకపోవడంతో వీకెండ్ మీద ఆశలు తక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత అయితే సినిమా నిలబడడం చాలా కష్టం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయ్ పాన్ ఇండియా సక్సెస్ ఆశలు గల్లంతయినట్లే. లైగర్ వల్ల ఇండియా షేక్ అవడం కాదు.. ఈ సినిమాను నమ్ముకున్న వాళ్లే షేక్ అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on August 27, 2022 9:02 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…