రామ్ చరణ్ అభిమానులు శంకర్ మూవీకి బ్రేక్ ఇచ్చారేమో అని పడుతున్న టెన్షన్ కు సమాధానం దొరికేసింది. నిజంగానే కమల్ హాసన్ ఇండియన్ 2 అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఎప్పటి నుంచి రీ స్టార్ట్ చేస్తారనే సమాచారం స్పష్టంగా లేదు కానీ మొత్తానికి దానికి సంబంధించిన అడుగులు చకచకా పడిపోతున్నాయి. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైకేల్ వెస్ట్ మోర్ తో కమల్ వ్యక్తిగతంగా సమావేశం జరిపి ఈ సినిమా తాలూకు మేకప్ ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద చర్చలు జరిపారు.
మైకేల్ గతంలో దశావతారంకు పని చేశారు. అందులో పది పాత్రల్లో లోకనాయకుడిని చూపించిన తీరు అబ్బురపరిచింది. తనతో అనుబంధం కమల్ కు అవ్వై షణ్ముఖి(భామనే సత్యభామనే)నుంచే మొదలైంది. భారతీయుడు టైంకి ఈ ఇద్దరి మధ్య పరిచయం లేదు. తర్వాత కలుసుకున్నారు. ఇండియన్ 2లో హీరో పాత్ర అమెరికాలో మొదలువుతుంది. అక్కడే ఉంటూ ఆ వేషభాషలకు అనుగుణంగా తన మొహాన్ని మార్చుకుంటాడు సేనాపతి. అందుకే ప్రత్యేకంగా మైకేల్ అయితేనే న్యాయం చేయగలడని భావించి ఇండియాకు పిలిపించి మరీ వర్క్ చేయిస్తున్నారు.
భారతీయుడు వచ్చి ఇప్పటికి పాతికేళ్ళు దాటేసింది. అంటే అప్పుడు కమల్ రిస్క్ తీసుకున్నారంటే తీవ్రంగా ఇబ్బంది పడే సమస్య రాలేదు. కానీ ఇప్పుడలా కాదు. ప్రోస్తటిక్స్ మేకప్ కు అనుగుణంగా గంటల తరబడి కూర్చోవడం అంటే మాములు విషయం కాదు. హెల్త్ పరంగా వచ్చే రిస్కులను పరిగణనలోకి తీసుకోవాలి. మైకేల్ గతంలో స్టార్ ట్రెక్ కోసం పని చేస్తున్నపుడు కమల్ ఆయన దగ్గర ఓ ముప్పై రోజులు ఉండి మరీ శిక్షణ తీసుకున్నాడు. ఇంత సీరియస్ గా వర్క్ జరుగుతోందంటే ఇండియన్ 2 వేగంగా పూర్తి చేసే ప్రణాళిక రెడీ అయ్యింది. సో రామ్ చరణ్ 15కు మరికొంత బ్రేక్ అనే క్లారిటీ వచ్చేసినట్టే
This post was last modified on August 22, 2022 6:57 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…