బాక్సాఫీస్ వద్ద పోటీ పరిస్థితులు చాలా అనూహ్యంగా ఉంటున్నాయి. ఒకే రోజు క్లాష్ అయితే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందనే భ్రమను బింబిసార, సీతారామంలు బద్దలు కొట్టేయడంతో ఎగ్జిబిటర్ల ఆనందం మాములుగా లేదు. రెండూ దేనికవే ధీటుగా వసూళ్లు రాబట్టడం మరికొందరికి ధైర్యాన్ని ఇచ్చింది. అయితే ప్రతిసారి ఇలాంటి ఫలితాలు వస్తాయని కాదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ ఎదురుగా ఒక ప్యాన్ ఇండియా మూవీని పెట్టుకుని దాంతో చిన్న సినిమాలు తలపడటం అంటే పెద్ద సాహసమే.
25న లైగర్ ఎంత గ్రాండ్ గా రిలీజవుతోందో చూస్తున్నాం. అయితే 26ను టార్గెట్ చేసి పెద్దగా బడ్జెట్ ఖర్చవ్వని చిత్రాలు రేస్ లో దిగడం ఆసక్తి రేపుతోంది. అందులో అంతో ఇంతో చెప్పుకోదగ్గ బజ్ ఉన్నది కళాపురం. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సీరియస్ జానర్ చేశాక దర్శకుడు కరుణ కుమార్ పూర్తిగా ఎంటర్ టైనర్ స్కూల్ కొచ్చి చేసిన సినిమా ఇది. అదే రోజు గీత అనే మరో చిన్న చిత్రం బరిలో ఉంది. సునీల్ ఒక్కడే మెయిన్ ఆర్టిస్టుగా ప్రమోట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న ధనరాజ్ సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన బుజ్జి ఇలా రా దిగుతోంది.
ఇవన్నీ బజ్ లేనివే. ఒకవేళ లైగర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వీటికి ఇబ్బందే. థియేటర్లు దొరకడం ఒక సమస్య అయితే టాక్ పెద్దగా బయటికి రాకపోతే తిరిగి లేపేసి లైగర్ నే వేసుకుంటారు. విజువల్ గా సంథింగ్ స్పెషల్ ఉంటే తప్ప థియేటర్లకు జనాలు అంత ఈజీగా కదల్లేని పరిస్థితులు ఉండగా ఇప్పుడివి రిస్క్ చేయడం విశేషమే. ఇక్కడితో అయిపోలేదు. వారం తిరక్కుండానే 31న విక్రమ్ కోబ్రా, తమిళ డబ్బింగ్ పిశాచి 2 వచ్చేస్తాయి. చూస్తుంటే ఈ ధైర్యానికి కారణం ఓటిటి కండీషన్లా లేక కంటెంట్ మీద బలమైన నమ్మకమా అంతుచిక్కడం లేదు.
This post was last modified on August 22, 2022 9:16 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…