బాక్సాఫీస్ వద్ద పోటీ పరిస్థితులు చాలా అనూహ్యంగా ఉంటున్నాయి. ఒకే రోజు క్లాష్ అయితే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందనే భ్రమను బింబిసార, సీతారామంలు బద్దలు కొట్టేయడంతో ఎగ్జిబిటర్ల ఆనందం మాములుగా లేదు. రెండూ దేనికవే ధీటుగా వసూళ్లు రాబట్టడం మరికొందరికి ధైర్యాన్ని ఇచ్చింది. అయితే ప్రతిసారి ఇలాంటి ఫలితాలు వస్తాయని కాదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ ఎదురుగా ఒక ప్యాన్ ఇండియా మూవీని పెట్టుకుని దాంతో చిన్న సినిమాలు తలపడటం అంటే పెద్ద సాహసమే.
25న లైగర్ ఎంత గ్రాండ్ గా రిలీజవుతోందో చూస్తున్నాం. అయితే 26ను టార్గెట్ చేసి పెద్దగా బడ్జెట్ ఖర్చవ్వని చిత్రాలు రేస్ లో దిగడం ఆసక్తి రేపుతోంది. అందులో అంతో ఇంతో చెప్పుకోదగ్గ బజ్ ఉన్నది కళాపురం. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సీరియస్ జానర్ చేశాక దర్శకుడు కరుణ కుమార్ పూర్తిగా ఎంటర్ టైనర్ స్కూల్ కొచ్చి చేసిన సినిమా ఇది. అదే రోజు గీత అనే మరో చిన్న చిత్రం బరిలో ఉంది. సునీల్ ఒక్కడే మెయిన్ ఆర్టిస్టుగా ప్రమోట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న ధనరాజ్ సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన బుజ్జి ఇలా రా దిగుతోంది.
ఇవన్నీ బజ్ లేనివే. ఒకవేళ లైగర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వీటికి ఇబ్బందే. థియేటర్లు దొరకడం ఒక సమస్య అయితే టాక్ పెద్దగా బయటికి రాకపోతే తిరిగి లేపేసి లైగర్ నే వేసుకుంటారు. విజువల్ గా సంథింగ్ స్పెషల్ ఉంటే తప్ప థియేటర్లకు జనాలు అంత ఈజీగా కదల్లేని పరిస్థితులు ఉండగా ఇప్పుడివి రిస్క్ చేయడం విశేషమే. ఇక్కడితో అయిపోలేదు. వారం తిరక్కుండానే 31న విక్రమ్ కోబ్రా, తమిళ డబ్బింగ్ పిశాచి 2 వచ్చేస్తాయి. చూస్తుంటే ఈ ధైర్యానికి కారణం ఓటిటి కండీషన్లా లేక కంటెంట్ మీద బలమైన నమ్మకమా అంతుచిక్కడం లేదు.
This post was last modified on August 22, 2022 9:16 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…