ఒకప్పటి బ్లాక్ బస్టర్ల పట్ల అభిమానుల్లో ఉండే క్రేజ్ ని క్యాష్ చేసుకునే ట్రెండ్ జోరందుకుంది. పోకిరికి భీభత్సమైన రెస్పాన్స్ రావడంతో ఒక్కొక్కరుగా ఆ బాట పడుతున్నారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు, సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే సందర్భంగా జల్సాకి స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఫ్యాన్స్ 29న సోగ్గాడే చిన్ని నాయనాకు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ వచ్చింది. మొత్తానికి క్రమం తప్పకుండ ఇకపై బిగ్ స్క్రీన్ మీద క్లాసిక్స్ చూసే అవకాశాలు వస్తూనే ఉంటాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ వీటికి కూడా కొత్త సినిమాలకు ఉంటున్న టికెట్ రేట్లే పెట్టడం సగటు ప్రేక్షకులకు అన్నీ చూసే ఛాన్స్ ని పోగొడుతున్నాయి. ఉదాహరణకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో వీటికి 200 రూపాయలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మల్టీ ప్లెక్సుల్లో 177 అలాగే కంటిన్యూ అవుతోంది. వీటిని తగ్గించి అమ్మొచ్చుగా అనేది ఫ్యాన్స్ మాట. ఎంత వీటిని మరోసారి థియేటర్ లో చూడాలన్న ఆత్రం ఉన్నా దాన్ని ఈ స్థాయిలో క్యాష్ చేసుకుంటే ఎలాని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే వీటిపై ఆసక్తి తగ్గిపోతుందన్న మాటలో లాజిక్ ఉంది.
జనం సినిమా హాళ్ల పట్ల ఆసక్తి తగ్గిపోతున్న టైంలో బింబిసార, కార్తికేయ 2, సీతారామంలు ఇచ్చిన కిక్ మామూలుది కాదు. దేశం మొత్తం మనవైపే చూసేలా కలెక్షన్లు వచ్చి పడ్డాయి. ఏ బాషలోనూ ఒకే నెలలో ఇంత సక్సెస్ రేట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత చిత్రాలను కూడా ఇంతగా ఆదరిస్తున్న మూవీ లవర్స్ కోసమైనా వీటికి తగ్గింపు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అసలే ఈ సిరీస్ లో వర్షం, దేశముదురు, ఇంద్ర, సమరసింహారెడ్డి, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ క్యూలో ఉన్నాయి. యుట్యూబ్ లో ఉన్నవాటికి మళ్ళీ థియేటర్లకు రప్పించాలంటే డిస్కౌంట్లు ఇస్తే బెటర్ కదా.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…