స్టార్ హీరోలకు తమ సినిమా మీద ఎంత నమ్మకమైనా ఉండొచ్చు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారితేనే అసలు సమస్య. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టం పదుల కోట్లలో ఉంటుంది. అదిప్పుడు అమీర్ ఖాన్ విషయంలో అక్షరాలా నిజమయ్యింది. ముంబై మీడియాలో వస్తున్న పలు కథనాలు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. లాల్ సింగ్ చడ్డా విడుదల ముందు నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమీర్ ఖాన్ నూటా యాభై కోట్లకు ఓటిటి డీల్ అడిగాడట. ప్రైమ్, హాట్ స్టార్ కన్నా గ్లోబల్ రీచ్ దీనికే ఎక్కువ కాబట్టి ఎలాగైనా ఒప్పించాలని పూనుకున్నాడు.
కానీ తను అడిగింది మరీ ఎక్కువగా ఉండటంతో సదరు సంస్థ నసిగింది. తక్కువ గ్యాప్ తో 100 కోట్లలోపైతే ఆలోచిస్తామని బదులిచ్చారు. అయితే అమీర్ ససేమిరా అన్నాడు. 125 కోట్లు ప్లస్ ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ కండీషన్ తో మరో ప్రతిపాదన పంపించాడు. దీన్ని నెట్ ఫ్లిక్స్ అసలే వద్దనుకుని సైలెంట్ అయ్యింది. వూట్ సెలెక్ట్ ఇంత మొత్తం కాదు సిక్స్ మంత్స్ ఓకే కానీ ధర మాత్రం రిలీజయ్యాక ఫిక్స్ చేద్దామని డీల్ చేసుకుంది. కట్ చేస్తే లాల్ సింగ్ చడ్డా అమీర్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
నిజానికి నెట్ ఫ్లిక్స్ తమ ఆఖరి ప్రపోజల్ గా 80 కోట్లు ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. అయినా కూడా తగ్గేదేలే అన్న అమీర్ అత్యాశ ఇప్పుడు నిలువునా కొంప ముంచేసింది. ముందు బిల్డప్ ఇచ్చినట్టు నిజంగానే ఆరు నెలల తర్వాత లాల్ సింగ్ చడ్డాని ఓటిటిలో వదిలితే చూసేవాళ్ళు ఉండరు. ఇప్పుడున్న వ్యతిరేకత అప్పటికి తగ్గిపోతుందనుకుంటే అమాయకత్వమే. ఏదో గుడ్డిలో మెల్లలాగా వీలైనంత త్వరగా స్మార్ట్ స్క్రీనింగ్ ఇచ్చేస్తే బాయ్ కాట్ చేసినవాళ్లు కూడా ఇంట్లోనే కదాని చూసే అవకాశాలు ఉంటాయి. లేదంటే అంతే సంగతులు
This post was last modified on August 21, 2022 8:17 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…