నమిత.. ఈ పేరును 2000-2010 మధ్య యవ్వనంలో ఉన్న కుర్రాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. ఇటు తెలుగులో, అటు తమిళంలో తన హాట్ హాట్ అందాలతో ఆమె అప్పటి కుర్రాళ్లను ఒక ఊపు ఊపేసింది. నటిగా అవకాశాలు పూర్తిగా ఆగిపోయిన దశలో, ఐదేళ్ల కిందట నమిత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైంది. ఆమె భర్త పేరు వీరేంద్ర చౌదరి. అతను తెలుగువాడే. ఈ జంటకు ఇప్పుడు కవలలు పుట్టారు. చెన్నైలో నమిత ఒకేసారి ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది.
ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా నమితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. భార్యాభర్తలిద్దరూ తలో బిడ్డను ఎత్తుకున్న ఫొటోను నమిత పోస్ట్ చేసింది. తనతో పాటు బిడ్డలూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన నమిత.. గర్భం దాల్చినప్పటికీ వైద్యపరంగా సలహాలు, సూచనలు అందించిన అందరికీ, అలాగే ప్రసవానికి సహకరించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపింది.
2002లో తెలుగులో ‘సొంతం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది నమిత. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా నమితకు మంచి పేరే వచ్చింది. ఈ ఫేమ్తో ‘జెమిని’ లాంటి పెద్ద సినిమాలో కథానాయికా అవకాశం దక్కించకుంది. కానీ ఆ సినిమా సైతం ఫ్లాప్ అయింది. ఆపై ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణులు లాంటి క్రేజీ చిత్రాల్లో నటించిన ఫలితం లేకపోయింది. ఆ టైంలోనే ఆమె దృష్టి తమిళ చిత్రాలపై పడింది.
తెలుగులో మాదిరి ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేయకుండా.. అక్కడ హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. వ్యాంప్ పాత్రలు, ఐటెం సాంగ్స్లో మెరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మారిపోయింది. విపరీతంగా బరువు పెరిగిపోయి, ఆ భారీ అందాలనే ఆరబోయడం మొదలు పెట్టిన నమిత కొన్ని వివాదాలూ ఎదుర్కోక తప్పలేదు. తెలుగులో సైతం తర్వాత ఆమె వ్యాంప్ తరహా పాత్రలే చేసింది. కెరీర్ చివరి దశలో తమిళంలో ఆమె కొన్ని బిగ్రేడ్ సినిమాల్లోనూ నటించింది. చివరికి ఐదేళ్ల కిందట తెలుగు వాడే అయిన నరేంద్రను నమిత తిరుమలలో సింపుల్గా పెళ్లి చేసుకుంది.
This post was last modified on August 20, 2022 10:10 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…