నమిత.. ఈ పేరును 2000-2010 మధ్య యవ్వనంలో ఉన్న కుర్రాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. ఇటు తెలుగులో, అటు తమిళంలో తన హాట్ హాట్ అందాలతో ఆమె అప్పటి కుర్రాళ్లను ఒక ఊపు ఊపేసింది. నటిగా అవకాశాలు పూర్తిగా ఆగిపోయిన దశలో, ఐదేళ్ల కిందట నమిత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైంది. ఆమె భర్త పేరు వీరేంద్ర చౌదరి. అతను తెలుగువాడే. ఈ జంటకు ఇప్పుడు కవలలు పుట్టారు. చెన్నైలో నమిత ఒకేసారి ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది.
ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా నమితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. భార్యాభర్తలిద్దరూ తలో బిడ్డను ఎత్తుకున్న ఫొటోను నమిత పోస్ట్ చేసింది. తనతో పాటు బిడ్డలూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన నమిత.. గర్భం దాల్చినప్పటికీ వైద్యపరంగా సలహాలు, సూచనలు అందించిన అందరికీ, అలాగే ప్రసవానికి సహకరించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపింది.
2002లో తెలుగులో ‘సొంతం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది నమిత. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా నమితకు మంచి పేరే వచ్చింది. ఈ ఫేమ్తో ‘జెమిని’ లాంటి పెద్ద సినిమాలో కథానాయికా అవకాశం దక్కించకుంది. కానీ ఆ సినిమా సైతం ఫ్లాప్ అయింది. ఆపై ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణులు లాంటి క్రేజీ చిత్రాల్లో నటించిన ఫలితం లేకపోయింది. ఆ టైంలోనే ఆమె దృష్టి తమిళ చిత్రాలపై పడింది.
తెలుగులో మాదిరి ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేయకుండా.. అక్కడ హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. వ్యాంప్ పాత్రలు, ఐటెం సాంగ్స్లో మెరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మారిపోయింది. విపరీతంగా బరువు పెరిగిపోయి, ఆ భారీ అందాలనే ఆరబోయడం మొదలు పెట్టిన నమిత కొన్ని వివాదాలూ ఎదుర్కోక తప్పలేదు. తెలుగులో సైతం తర్వాత ఆమె వ్యాంప్ తరహా పాత్రలే చేసింది. కెరీర్ చివరి దశలో తమిళంలో ఆమె కొన్ని బిగ్రేడ్ సినిమాల్లోనూ నటించింది. చివరికి ఐదేళ్ల కిందట తెలుగు వాడే అయిన నరేంద్రను నమిత తిరుమలలో సింపుల్గా పెళ్లి చేసుకుంది.
This post was last modified on August 20, 2022 10:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…