నమిత.. ఈ పేరును 2000-2010 మధ్య యవ్వనంలో ఉన్న కుర్రాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. ఇటు తెలుగులో, అటు తమిళంలో తన హాట్ హాట్ అందాలతో ఆమె అప్పటి కుర్రాళ్లను ఒక ఊపు ఊపేసింది. నటిగా అవకాశాలు పూర్తిగా ఆగిపోయిన దశలో, ఐదేళ్ల కిందట నమిత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైంది. ఆమె భర్త పేరు వీరేంద్ర చౌదరి. అతను తెలుగువాడే. ఈ జంటకు ఇప్పుడు కవలలు పుట్టారు. చెన్నైలో నమిత ఒకేసారి ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది.
ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా నమితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. భార్యాభర్తలిద్దరూ తలో బిడ్డను ఎత్తుకున్న ఫొటోను నమిత పోస్ట్ చేసింది. తనతో పాటు బిడ్డలూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన నమిత.. గర్భం దాల్చినప్పటికీ వైద్యపరంగా సలహాలు, సూచనలు అందించిన అందరికీ, అలాగే ప్రసవానికి సహకరించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపింది.
2002లో తెలుగులో ‘సొంతం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది నమిత. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా నమితకు మంచి పేరే వచ్చింది. ఈ ఫేమ్తో ‘జెమిని’ లాంటి పెద్ద సినిమాలో కథానాయికా అవకాశం దక్కించకుంది. కానీ ఆ సినిమా సైతం ఫ్లాప్ అయింది. ఆపై ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణులు లాంటి క్రేజీ చిత్రాల్లో నటించిన ఫలితం లేకపోయింది. ఆ టైంలోనే ఆమె దృష్టి తమిళ చిత్రాలపై పడింది.
తెలుగులో మాదిరి ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేయకుండా.. అక్కడ హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. వ్యాంప్ పాత్రలు, ఐటెం సాంగ్స్లో మెరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మారిపోయింది. విపరీతంగా బరువు పెరిగిపోయి, ఆ భారీ అందాలనే ఆరబోయడం మొదలు పెట్టిన నమిత కొన్ని వివాదాలూ ఎదుర్కోక తప్పలేదు. తెలుగులో సైతం తర్వాత ఆమె వ్యాంప్ తరహా పాత్రలే చేసింది. కెరీర్ చివరి దశలో తమిళంలో ఆమె కొన్ని బిగ్రేడ్ సినిమాల్లోనూ నటించింది. చివరికి ఐదేళ్ల కిందట తెలుగు వాడే అయిన నరేంద్రను నమిత తిరుమలలో సింపుల్గా పెళ్లి చేసుకుంది.
This post was last modified on August 20, 2022 10:10 am
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక…
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం…
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…