‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. దీని కంటే ముందు అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు కానీ.. ఈ సినిమాతో అతను బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం అంతా ఇంతాకాదు. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద జరిగిన మారణకాండను ఎంతో హృద్యంగా, ఒళ్లు గగుర్పొడిచేలా అతను చూపించిన వైనం ప్రేక్షకులను మెప్పించింది. చిన్న సినిమాగా రిలీజై అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం బాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా తీయడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నుంచి ఫుల్ సపోర్ట్ పొందిన వివేక్.. బాలీవుడ్లో లిబరల్స్గా పేరున్న హీరోలు, దర్శకులను ఈ మధ్య గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా అతను ‘లాల్ సింగ్ చడ్డా’ను టార్గెట్ చేశాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ పూర్ ఓపెనింగ్స్ గురించి పేర్కొన్న ఒక ట్వీట్పై వివేక్ స్పందిస్తూ.. బాలీవుడ్ ఇలాంటి అవమానాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఎవరు? బాలీవుడ్లో ఎంతోమంది నటులు, దర్శకులు, రచయితలను బాయ్కాట్ చేసి వాళ్ల కెరీర్లు నాశనం కావడానికి కారణమైనపుడు వారి గురించి ఎవరైనా నోరెత్తారా అని ప్రశ్నించాడు.
బాలీవుడ్ డాన్లు ఎన్నో చిన్న సినిమాలను నాశనం చేశారని.. మల్టీప్లెక్సుల్లో షోలు పడకుండా ఆపించారని.. కొందరు క్రిటిక్స్ సైతం చిన్న సినిమాలను చంపేయడానికి ప్రయత్నించారని.. అప్పుడు ఆయా సినిమాలకు పని చేసిన 250 మంది పేద యూనిట్ సభ్యుల గురించి ఎవరూ ఆలోచించలేదని వివేక్ అన్నాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ కోసం 250 మంది కష్టపడి పని చేశారని, ఆ సినిమాను బాయ్కాట్ చేయొద్దని కథానాయిక కరీనా కపూర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు వివేక్ పంచ్ వేశాడన్నది స్పష్టం. ఆమిర్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురు దెబ్బ తగలగానే ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలన్న పిలుపు పట్ల బాలీవుడ్లో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. ఐతే తన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ను బాయ్కాట్ చేయాలని ఇలాగే ఒక వర్గం ద్వేషపూరిత ప్రచారం చేసినపుడు వీళ్లంతా ఏం చేస్తున్నారని అతను ప్రశ్నించాడు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…