‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. దీని కంటే ముందు అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు కానీ.. ఈ సినిమాతో అతను బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం అంతా ఇంతాకాదు. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద జరిగిన మారణకాండను ఎంతో హృద్యంగా, ఒళ్లు గగుర్పొడిచేలా అతను చూపించిన వైనం ప్రేక్షకులను మెప్పించింది. చిన్న సినిమాగా రిలీజై అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం బాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా తీయడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నుంచి ఫుల్ సపోర్ట్ పొందిన వివేక్.. బాలీవుడ్లో లిబరల్స్గా పేరున్న హీరోలు, దర్శకులను ఈ మధ్య గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా అతను ‘లాల్ సింగ్ చడ్డా’ను టార్గెట్ చేశాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ పూర్ ఓపెనింగ్స్ గురించి పేర్కొన్న ఒక ట్వీట్పై వివేక్ స్పందిస్తూ.. బాలీవుడ్ ఇలాంటి అవమానాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఎవరు? బాలీవుడ్లో ఎంతోమంది నటులు, దర్శకులు, రచయితలను బాయ్కాట్ చేసి వాళ్ల కెరీర్లు నాశనం కావడానికి కారణమైనపుడు వారి గురించి ఎవరైనా నోరెత్తారా అని ప్రశ్నించాడు.
బాలీవుడ్ డాన్లు ఎన్నో చిన్న సినిమాలను నాశనం చేశారని.. మల్టీప్లెక్సుల్లో షోలు పడకుండా ఆపించారని.. కొందరు క్రిటిక్స్ సైతం చిన్న సినిమాలను చంపేయడానికి ప్రయత్నించారని.. అప్పుడు ఆయా సినిమాలకు పని చేసిన 250 మంది పేద యూనిట్ సభ్యుల గురించి ఎవరూ ఆలోచించలేదని వివేక్ అన్నాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ కోసం 250 మంది కష్టపడి పని చేశారని, ఆ సినిమాను బాయ్కాట్ చేయొద్దని కథానాయిక కరీనా కపూర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు వివేక్ పంచ్ వేశాడన్నది స్పష్టం. ఆమిర్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురు దెబ్బ తగలగానే ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలన్న పిలుపు పట్ల బాలీవుడ్లో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. ఐతే తన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ను బాయ్కాట్ చేయాలని ఇలాగే ఒక వర్గం ద్వేషపూరిత ప్రచారం చేసినపుడు వీళ్లంతా ఏం చేస్తున్నారని అతను ప్రశ్నించాడు.
This post was last modified on August 15, 2022 6:34 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…