బాలీవుడ్ ఎంతటి గడ్డు పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఆగస్ట్ 11 గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాకు రెండో రోజే సుమారు 1300 పైగా షోలు క్యాన్సిల్ కావడం ఆ హీరో కెరీర్ లోనే దారుణమైన అవమానంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవి రద్దు చేయడానికి కారణం కనీసం పది మంది ప్రేక్షకులైనా టికెట్లు కొనకపోవడమే. కరెంట్ బిల్లులైనా రాకపోతే ఆడించి ప్రయోజనం ఏముందని అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారట. ఇందులో మల్టీప్లెక్సులు కూడా ఉన్నాయి.
నిజానికి మొదటి షో టాక్ బయటికి రాకముందే దీనిపట్ల జనం ఆసక్తి కనబరచడం లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. దానికి తోడు పబ్లిక్ టాక్, రివ్యూలు దారుణంగా ఉండటంతో నేరుగా థియేటర్ కు వెళ్లి టికెట్లు కొనాలనుకున్న బ్యాచ్ కూడా ఇంట్లోనే ఆగిపోయింది. తన సినిమా ఆరు నెలల తర్వాత కానీ ఓటిటిలో రాదని అమీర్ ఖాన్ పదే పదే చెప్పుకున్నా ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే ఆరు సంవత్సరాల తర్వాత డిజిటిల్ లో వదులుతామని చెప్పినా ఎలాంటి ప్రయోజనం కలిగే సూచనలు కనిపించడం లేదు.
క్రమం తప్పకుండా నార్త్ ట్రేడ్ కి బ్యాడ్ ఫ్రైడేస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడునెలలు గడిచిపోయాయి. ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్య 2, గంగూబాయ్ కటియావాడి తప్ప చెప్పుకోదగ్గ విజయాలు లేవు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సైతం ఎమోషన్ సెంటిమెంట్ దట్టంగా వడ్డించినా సరే తిరస్కారం తప్పేలా లేదు. ఇలా వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు షోలు క్యాన్సిల్ అయ్యే పరిణామం ఇండస్ట్రీకి ఎంత మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా మాస్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన నష్టానికి అక్కడి మేకర్స్ తగిన మూల్యమే చెల్లిస్తున్నారు
This post was last modified on August 13, 2022 1:03 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…