ఇటీవలే చేసిన పోకిరి రీ రిలీజ్ ఎంత ప్రకంపనలు సృష్టించిందో చూశాంగా. పదహారేళ్ళ తర్వాత థియేటర్లోకొస్తే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ సైతం ఎగబడి చూశారు. అధికారిక లెక్కల్లోనే సుమారు 1 కోటి 70 లక్షల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ఇంకా ఎక్కువే ఉంటుందని వాదిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా దానికొచ్చిన రెస్పాన్స్ మాత్రం మైండ్ బ్లోయింగని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
పండుగాడి విశ్వరూపాన్ని, పూరి జగన్నాధ్ మాయాజాలాన్ని, మణిశర్మ సంగీతంతో కలిపి ఫుల్ గా ఎంజయ్ చేశారు. ఇప్పుడీ ట్రెండ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందిపుచ్చుకున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జల్సా మళ్ళీ థియేటర్లలో రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వబోతున్నారు.
కొద్దిరోజుల క్రితం దీని ప్రదర్శనకు కావాల్సిన ఒరిజినల్ డిపిఎక్స్ ఫైల్ మిస్ అయ్యిందని షో వేసే అవకాశం ఉంటుందో లేదోననే అనుమానాలు రేగాయి. అయితే ఫైనల్ గా గీతా ఆర్ట్స్ దీనికి చెక్ పెడుతూ నెగటివ్ ని రీ మాస్టరింగ్ కి ఇచ్చేసిందట. ప్రసాద్ ల్యాబ్స్ లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కం మ్యూజికల్ ఎంటర్ టైనర్ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. టీవీలో వచ్చాక ఇదో క్లాసిక్ గా మారిన మాట వాస్తవం. నక్సలైట్ గా, జనజీవనంలో కలిసిపోయిన సరదా కుర్రాడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ని పవన్ పోషించిన తీరు ఓ రేంజ్ లో మెప్పించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పేదేముంది. సో పండుగాడు వంతు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సంజయ్ సాహు ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…