దేశమంతా తిరిగి ప్రమోషన్లు చేసుకున్న లాల్ సింగ్ చడ్డా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైపోయింది. దీని మీద మన జనానికి అంతో ఇంతో ఆసక్తి కలిగిందంటే అది కేవలం నాగ చైతన్య వల్లే. బాయ్ కాట్ నినాదంతో గట్టి సెగలు ఎదురుకుంటున్న అమీర్ బృందానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గత రెండు మూడు రోజులుగా విపరీతమైన ఆందోళన కలిగించింది.
పైగా పోటీలో ఉన్న అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం, ప్రీ రిలీజ్ వైబ్రేషన్స్ దానికే కొంత మెరుగ్గా ఉండటం మరో ట్విస్ట్. సరే ఫైనల్ గా మాట్లాడేది కంటెంటే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా మీద మిశ్రమ స్పందన వస్తోంది. క్రిటిక్స్ పెదవి విరిచారు. మంచి అవకాశాన్ని అమీర్ వృధా చేసుకున్నాడని, ఫారెస్ట్ గంప్ ని రీమేక్ చేయకపోయినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ జోరుగా వీస్తోంది. పోనీ చైతు క్యారెక్టర్ అయినా బలంగా ఉండి తనకు బాలీవుడ్ ఆఫర్లు తెచ్చేలా ఉందా అంటే అదీ జరగలేదనే చెప్పాలి. బోడిపాలెం బాలరాజుకి ఇచ్చిన స్క్రీన్ టైం తక్కువే. తాను ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉండనని నాగచైతన్య ముందే చెప్పాడు.
కథలో కీలకమైన మలుపు కూడా అతనితో ముడిపడి ఉంది. కానీ ఆ పాత్రకు అల్లిన చడ్డీ బనియన్ కాన్సెప్ట్ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. పదే పదే ఈ రెండు పదాలను పలికిస్తూ ఆర్మీలో ఉన్నా వీటి జపమే చేసే బాలరాజుగా పెర్ఫార్మన్స్ బాగానే వచ్చినప్పటికీ ఈ ఎపిసోడ్ మాత్రం అంతగా పేలలేదు. అసలే థాంక్ యు ఫలితం నిరాశ కలిగించిందని స్వయానా ఒప్పుకున్న చైతుకి ఇప్పుడీ లాల్ సింగ్ చడ్డా కూడా అదే రిజల్ట్ ఇచ్చేలా ఉండటం బ్యాడ్ లక్
This post was last modified on August 11, 2022 8:15 pm
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…