గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ దక్కకపోయినా ఏదో ఒకటి కమర్షియల్ గా వర్కౌట్ చేసుకుంటూ పోతూ గజినీ మహమ్మద్ లా దండయాత్రలు చేస్తూనే వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఆఖరికి ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అది ఎక్కడి దాకా వచ్చిందో పూర్తయ్యిందో లేదో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.
దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉంటున్నా దానికి సంబంధించిన విషయాలు మాత్రం ఎక్కడా ప్రస్తావనకు తేవడం లేదు. అధికశాతం పూర్తయినా మౌనంగానే ఉన్నారు. దీని సంగతలా ఉంచితే బెల్లం ఫ్యామిలీ రెండో వారసుడు గణేష్ హీరోగా డెబ్యూ చేస్తున్న మూవీ స్వాతిముత్యం వాస్తవానికి ఈ 13కి విడుదల కావాల్సి ఉంది. అయితే పరిస్థితులు ప్లస్ పోటీ దృష్ట్యా దాన్ని వాయిదా వేశారు.
ఇవాళ కొత్త డేట్ అక్టోబర్ 5 ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఆల్రెడీ అదే తేదీకి నాగార్జున ది ఘోస్ట్ వస్తుందని తెలిసీ స్వాతిముత్యంని బరిలో దింపడం ఆసక్తి రేపుతోంది. పైగా చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా పండగ రేస్ లో ఉండొచ్చని ఆ మధ్య టీజర్ లో హింట్ ఇచ్చేశారు. మరి ఇద్దరు సీనియర్ల మధ్య దిగడం ఖచ్చితంగా రిస్కే. పైగా ఈ స్వాతిముత్యం గ్రాఫిక్స్ తో ముడిపడిన గ్రాండియర్ కాదు. మాస్ ఎలిమెంట్స్ కూడుకున్న మసాలా మూవీ కాదు. ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా సాగే సాఫ్ట్ మూవీ.
అలాంటప్పుడు చిరు నాగ్ ల మధ్య రావడం కన్నా సోలోగా వస్తే ప్రేక్షకులకు ఇంకా బాగా రిజిస్టర్ అవ్వడంతో పాటు రీచ్ ఎక్కువగా ఉంటుంది. అసలే చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప జనం థియేటర్ల దాకా రావడం లేదు. అలాంటిది కొత్త హీరో కోసం టికెట్లు కొనాలంటే ఏమేం ఉండాలో వేరే చెప్పాలా. కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా టైటిల్ ని వాడుకుంటున్న గణేష్ మరి అంతే స్థాయిలో ఫలితం తెచ్చుకుంటాడా చూద్దాం
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…